TG: స్నానం చేయడం అనేది కేవలం ఒంటిని శుభ్రం చేసుకోవడమే కాదు, మన దేశంలో స్నానానికి ఒక పవిత్రమైన స్థానం ఉంది. పురాణాల ప్రకారం ఉదయాన్నే స్నానం చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారుతుందని నమ్ముతాం. దీనికి తోడు భారత్ ఒక ఉష్ణమండల దేశం. రాత్రి నిద్రలో మనకు విపరీతంగా చెమట పడుతుంది. అందుకే ఉదయాన్నే స్నానం చేయడం వల్ల అలసట పోయి, రోజంతా ఉత్సాహంగా ఉండటానికి వీలవుతుంది.