పిల్లలు మనం చెప్పే మాటల కంటే, చేసే పనులనే ఎక్కువగా గమనిస్తూ నేర్చుకుంటారు. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల మనం చూపే శ్రద్ధ, క్రమం తప్పకుండా చేసే వ్యాయామాలు, మనం తీసుకునే ఆహారపు అలవాట్లు వారిపై తీవ్ర ప్రభావం చూపుతాయి. తల్లిదండ్రుల జీవనశైలే పిల్లలకు తొలి పాఠం. కాబట్టి, వారు ఆరోగ్యంగా ఎదగాలంటే ముందుగా మన అలవాట్లను క్రమశిక్షణతో కూడిన ఆదర్శంగా మార్చుకోవాలి.
శరీరంలో ఎముకల పటిష్టతకు, రోగనిరోధక శక్తిని పెంచడానికి మిటమిన్ డి అత్యంత కీలకమైన పోషకం. విటమిన్ డి లభించాలంటే ఎండలో ఉండటం సులభమైన మార్గమని అందరికీ తెలుసు. అయితే కేవలం ఎండలో కూర్చోవడం ల్ల అందరికీ విటమిన్ డి సరిపోతుందని చెప్పలేమని నిపుణులు తెలిపారు. శరీర తత్వం, వయస్సు, చర్మ రంగు, ఎండలో గడిపే సమయం వంటి అంశాలపై దీని ప్రభావం ఆధారపడి ఉంటుందని చెప్పారు.
రాత్రి పడుకునే ముందు గ్లాసు పాలు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి శరీరంలో సెరోటోనిన్ను పెంచి ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో మంచిగా నిద్ర పడుతుంది. ఉదయం పేగు కదలిక ప్రక్రియ సులభమై మలబద్దకం సమస్య ఉండదు. సంతానోత్పత్తిని పెంచడంలోనూ ఉపయోగకరంగా ఉంటుంది. కొందరికి లాక్టోస్ సైడ్ ఎఫెక్ట్ కారణంగా విరేచనాలు, గ్యాస్ వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.
ఎండాకాలంలో సొరకాయ తీసుకోవడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. ఇందులో 92 శాతం నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచడానికి పనిచేస్తుంది. వేసవిలో దీనిని తీసుకోవడం ద్వారా శరీరంలో నీటి సమతుల్యతను కాపాడుకోవచ్చు. తద్వారా డీహైడ్రేషన్ నుంచి రక్షణ లభిస్తుంది. అధిక వేడి వల్ల కలిగే అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న సమయంలో మీ డైట్లో ఇది ఉత్తమమైన కూరగాయ.
అష్టవక్రాసనం చేతులు, మణికట్టు, భుజాలను బలంగా చేస్తుంది. పొత్తికడుపు కండరాలను బలోపేతం చేసి, కోర్ స్ట్రెంత్ను పెంచుతుంది. వెన్నుముక, తొడ కండరాలు, తుంటి భాగాన్ని సాగదీసి వశ్యతను పెంచుతుంది. శరీర సమతుల్యతను, శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. ఈ భంగిమను నిర్వహించడానికి అధిక ఏకాగ్రత అవసరం. దీనివల్ల మానసిక స్థిరత్వం పెరుగుతుంది.
* రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు.* ఎదిగే పిల్లల మెదడు చురుగ్గా ఉంటుంది.* శరీర వేడిని తగ్గిస్తుంది.* శారీరక దృఢత్వం వస్తుంది.* బీపీ, షుగర్ అదుపులో ఉంటాయి.* రక్తస్త్రావం తగ్గుతుంది.* వీర్యకణాల వృద్ధి జరుగుతుంది.
పెసరపప్పుతో చేసిన లడ్డూలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులో ప్రోటీన్, ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం సమస్య తగ్గుతుంది. ఆకలిని నియంత్రించి, బరువు తగ్గడంలో సహాయపడుతుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచి, వ్యాధి నిరోధకశక్తిని పెంచుతాయి. పెరుగుతున్న పిల్లలకు అవసరమైన ప్రోటీన్, కాల్షియం, ఇతర ఖనిజాలు ఇందులో ఉండటం వల్ల పిల్లలకు చాలా పోషకమైన ఆహారం.
ఖాళీ కడుపుతో కాకరకాయ జ్యూస్ తాగడం వల్ల బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను సహజంగా తగ్గిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది ఒక వరం. ఇది కాలేయంలోని విషతుల్యాలను తొలగించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మొటిమలను తగ్గించి, చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. తక్కువ క్యాలరీలు, అధిక ఫైబర్ ఉండటం వల్ల ఆకలిని నియంత్రించి బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.
ధనియాలు ఆరోగ్యానికి చాలా మంచివి. ముఖ్యంగా ఉదయం పరగడుపున ధనియాల నీళ్లు తాగడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ నీళ్లు శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడంతో పాటు కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయి. ధనియాల నీళ్లు మెటబాలిజాన్ని పెంచుతాయి. బరువు నియంత్రణలో సహాయపడుతాయి.
బెర్రీలు డయాబెటిస్ను నియంత్రిస్తాయి. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్ బెర్రీలు, బ్లాక్ కరెంట్స్ వంటి వాటిల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఒక కప్పు బెర్రీలలో 15-20 గ్రాముల కార్బోహైడ్రేట్లు లభిస్తాయి. బెర్రీలు టైప్ 1 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించగలవు. ఆపిల్స్ కూడా డయాబెటిస్ ఉన్న వాళ్లు తమ రోజువారీ ఆహారంలో చేర్చుకోవచ్చు. అవకాడోలు కూడా షుగర్ నియంత్రించగలవు.
కపోతాసనం అనేది వెన్నెముకకు, తుంటి కండరాలకు, ఛాతీకి అద్భుతమైన సాగదీతను అందించే యోగాసనం. నడుము, వెన్నెముక కండరాలను బలోపేతం చేసి, వెన్నుపూసలో దృఢత్వాన్ని తగ్గించి నడుము నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణక్రియ, మెటబాలిజంను మెరుగుపరుస్తుంది. తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనను తగ్గించి మనస్సును ప్రశాంతపరుస్తుంది. రక్త ప్రసరణను ప్రేరేపించి, రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది.
మీ చర్మం యవ్వనంగా, కాంతిమంతంగా ఉండాలంటే.. బరువులు ఎత్తడం అత్యుత్తమ వ్యాయామం. ఇది చర్మం సాగే గుణాన్ని పెంచి, ముడతలు పడకుండా ఉండేందుకు దోహదపడే కొలాజిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. చర్మం మందాన్ని పెంచుతుంది. వయసు పైబడుతున్నా యవ్వనంగా కనిపించేందుుకు బరువులెత్తే కసరత్తులు క్రమం తప్పక చేయాలి.
ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు చల్లని నిమ్మ, పుదీనా షర్బత్ ఉతమైంది. పుదీనా, నిమ్మరసం, తేనె, వేయించిన జీలకర్ర పొడిని మిక్సీ పట్టి, తగినన్ని నీళ్లు, ఐస్ ముక్కలు కలిపి తాగితే మంచిది. నిమ్మ, పుదీనాలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. తేనె గుండె ఆరోగ్యానికి, జీలకర్ర జీర్ణక్రియ మెరుగుపరచడానికి తోడ్పడతాయి. ఇది డీహైడ్రేషన్ను అరికట్టి తక్షణ శక్తినిస్తుంది.
పుదీనా పోషకాల గని. ఇందులో విటమిన్ C, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పుదీనా జ్యూస్ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ముఖ్యంగా వేసవిలో డీహైడ్రేషన్ తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇందులోని సాలిసిలిక్ యాసిడ్ చర్మ నిగారింపునకు, మెంతోల్ శ్వాసకోశ సమస్యల నివారణకు తోడ్పడతాయి. అధిక బరువు, నోటి దుర్వాసన తగ్గించుకోవడానికి సహాయపడుతుంది.
తేనెలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్లతో పాటు విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ప్రతి రోజూ 1 లేదా 2 టీస్పూన్లు తీసుకుంటే శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని పొందుతుంది. గొంతు నొప్పి, దగ్గు ఉన్నప్పుడు కొద్దిగా తేనె తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. అయితే, తేనె ఆరోగ్యానికి మంచిదే కదా అని అతిగా తీసుకుంటే రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగి మధుమేహం ఉన్నవారికి సమస్యలు రావచ్చు.