వృశ్చికాసనం (స్కార్పియన్ పోజ్) యోగాలో అధునాతనమైన భంగిమ. శరీరాన్ని తేలు ఆకృతిలో మలిచి చేసే ఈ ఆసనం వల్ల శారీరక, మానసిక ప్రయోజనాలు ఉన్నాయి. శరీరంపై పూర్తి నియంత్రణ సాధించడంలో, బ్యాలెన్స్ మెరుగుపర్చడంలో పనిచేస్తుంది. భుజాలు, వెన్నెముక, తుంటి భాగాలను సాగదీస్తుంది. కండరాల దృఢత్వం తగ్గి వశ్యత పెరుగుతుంది. మెదడుకు రక్తప్రసరణను పెంచుతుంది. ఏకాగ్రత, మానసిక స్పష్టత పెరుగుతాయి.