KDP: చక్రాయపేట మండలం సురభి గ్రామ రైతు సేవా కేంద్రంలో వ్యవసాయ, ఉద్యాన శాఖ సహాయకులతో ఉద్యాన అధికారి రాఘవేంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో అందించే మామిడి ఫ్రూట్ కవర్లను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వీటిని వాడటం వల్ల చీడపీడల బెడద తగ్గి, కాయల పరిమాణం,నాణ్యత, రంగు మెరుగుపడుతుందని వివరించారు.
జనగామ పట్టణ కేంద్రంలోని ధర్మకంచ SC బాలుర హాస్టల్ ని అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా హాస్టల్ పరిసరాలను, కిచెన్ గదిని పరిశీలించారు. హాస్టల్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా పెట్టుకోవాలని, అలాగే వంటకి సంబందించి తాజా కూరగాయలను మాత్రమే వాడాలని సూచించారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.
BHNG: ప్రభుత్వ పాఠశాలలు, SC, ST, BC, మైనారిటీ రెసిడెన్షియల్ విద్యాలయాల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. విద్యార్థులకు ప్రతిరోజూ పోషకాలతో కూడిన నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, దీనిపై ప్రత్యేక అధికారులు నిరంతరం పర్యవేక్షణ జరపాలని సూచించారు. నిబంధనల ప్రకారం భోజన నాణ్యతలో ఎలాంటి లోపాలు ఉండకూడదన్నారు.
SRPT: తెలంగాణ ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టే బడ్జెట్లో బీసీలకు 50 వేల కోట్లు కేటాయించాలని బీసీ హక్కుల సాధన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి కనకయ్య కోరారు. ఈరోజు చిలుకూరు మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, అనంతరం డిప్యూటీ తహసీల్దార్ పుష్పలతకు వినతిపత్రం అందజేశారు.
KMR: సంగోజివాడి గ్రామంలో సీఎం, ఎమ్మెల్యే మదన్మోహన్ చిత్రపటాలకు మంగళవారం మహిళలు, ప్రజాప్రతినిధులు పాలాభిషేకం నిర్వహించారు. గ్రామంలో మహిళా సంఘ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా ఈ కార్యక్రమం చేపట్టారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు మహిళలను ఘనంగా సన్మానించారు.
BDK: మణుగూరు బీసీ బాలుర వసతి గృహంలో అస్వస్థతకు గురైన విద్యార్థులు తీసుకున్న ఆహార వివరాలను DMHO మంగళవారం అడిగి తెలుసుకున్నారు. స్థానిక ఏరియా ఆసుపత్రిని సందర్శించిన ఆయన, చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. అనంతరం వసతి గృహానికి వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని పరిశీలించారు.
★ నగరంలో బోనాల పండుగ సందర్భంగా రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే★ గవిచెర్లలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన అదనపు కలెక్టర్ సంధ్యారాణి★ వర్ధన్నపేటలో పిల్లల భద్రత, మాదకద్రవ్యాల నివారణపై అవగాహన సదస్సు★ వరంగల్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబల్ రోడ్డు ప్రమాదంలో మృతి
NTR: నందిగామ టౌన్ సెక్షన్, అనసాగరం విద్యుత్ ఉపకేంద్రం, 11KV హనుమంతుపాలెం ఫీడర్ పరిధిలో విద్యుత్ లైన్ల మెయింటినెన్స్, మరమ్మత్తులు జరగనున్నయి. కావున బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంట వరకు మునగచెర్ల, హనుమంతుపాలెం గ్రామాలలో విద్యుత్ సరఫరా నిలిపివేయ పడుతుందని విద్యుత్ అధికారి తెలిపారు. వినియోగదారులు సహకరించాలని వారు కోరారు.
BPT: చీరాల మున్సిపాలిటీ పరిధిలోని పేరాల మసీదు నుండి ఐఎల్టీడీ గేట్ వరకు డ్రెయిన్పై రూ.13 లక్షల వ్యయంతో నిర్మించనున్న కవర్ స్లాబ్కు మంగళవారం శంకుస్థాపన చేశారు. చీరాల నియోజకవర్గ టీడీపీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్రనాథ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక కౌన్సిలర్లు పాల్గొన్నారు.
MDCL: ఘట్కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫీర్జాదిగూడ, పర్వతాపూర్ రోడ్డులో గంజాయి అమ్మకాలు జరుపుతున్న వ్యక్తిని ఎస్టీఎఫ్ఏ టీం లీడర్ అంజిరెడ్డి సిబ్బంది పట్టుకున్నారు. నిందితుడు కుమ్మరి గోపి వద్ద 1.3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మున్నా అనే వ్యక్తిపై కూడా కేసు నమోదు చేశారు.
KNR: ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా గంగాధర మండలం మధుర నగర్ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరానికి స్పందన భారీ లభించింది. సర్పంచ్ వేముల భాస్కర్, ఉప సర్పంచ్ రాజు కుమార్ పాల్గొని గ్రామస్థులకు వైద్య సేవలపై అవగాహన కల్పించారు. ఈ శిబిరంలో వైద్యులు పలువురికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
KNR: శంకరపట్నం మండల కేంద్రంలో నిర్వహించిన ‘పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్-2026′ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంలో శిక్షణ తరగతులు కీలకమని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను కార్యకర్తలు ఇంటింటికీ తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
SRPT: ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ కమిషనర్ రామచంద్రరావు అన్నారు. మంగళవారం తిరుమలగిరి మున్సిపాలిటీలోని 6వ వార్డులో ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా మురికి కాల్వలను పరిశుభ్రం చేసి పిచ్చి మొక్కలను తొలగించి మాట్లాడారు. పరిసర పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే వ్యాధులు దరిచేరవన్నారు.
కోనసీమ: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పి.గన్నవరం వైసీపీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాస్ తాడేపల్లిలో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని కార్యకర్తల డిజిటలైజేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినందుకు జగన్ ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని తెలిపారని వెల్లడించారు.
EG: కొవ్వూరు పట్టణంలో చెత్త నిర్వహణలో నిర్లక్ష్యం ప్రజలప్రాణాలకు ముప్పుగా మారుతోందని స్థానికులు మంగళవారం ఆరోపిస్తున్నారు. 24 వార్డుల్లో పారిశుద్ధ్య కార్మికులు సేకరించిన క్విoటాళ్ల కొద్ది తడి పొడి చెత్తను గోదావరి ఆర్చ్ బ్రిడ్జి వద్ద తగులబెట్టడం వల్ల తీవ్ర కాలుష్యం వ్యాపిస్తోంది. పట్టణ ప్రజలు రోజూ విషపూరిత పొగతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయటున్నారు స్థానికులు.