• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘పారితోషికం వెంటనే చెల్లించాలి’

NRPT: ఆశాల రెండు నెలల పారితోషికాలు చెల్లించాలని మంగళవారం యూనియన్ ఆధ్వర్యంలో నారాయణపేట, కోటకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు బాలమణి మాట్లాడుతూ.. మార్చీ, ఏప్రిల్ పారితోషికాలు ఇంతవరకు చెల్లించలేదని వెంటనే చెల్లించాలని కోరారు.

May 5, 2026 / 09:01 PM IST

రేపు పోనకల్‌లో రైతు వారోత్సవాలకు ఆహ్వానం

MNCL: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా బుధవారం కవ్వాల్ క్లస్టర్ పరిధిలోని పోనకల్‌లో రైతు వారోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మండల స్థాయి బ్యాంక్ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు వ్యవసాయ విస్తరణ అధికారి ఏఈఓ అక్రమ్ ఒక ప్రకటనలో తెలిపారు.

May 5, 2026 / 09:00 PM IST

త్వరలో పెళ్లి పీటలెక్కనున్న బాలీవుడ్ బ్యూటీ

బాలీవుడ్ నటి హుమా ఖురేషి, నటుడు రచిత్ సింగ్‌తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ ఏడాది అక్టోబర్‌లో వీరి వివాహం ఘనంగా జరగబోతున్నట్లు బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ఈ విషయమై ఇప్పటివరకు వీరి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

May 5, 2026 / 09:00 PM IST

మోదీ సభకు కేంద్ర మంత్రి వాల్ రైటింగ్

KNR: ఈనెల 10న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే ప్రధాని మోదీ బహిరంగ సభకు తరలిరావాలని కోరుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్‌లో స్వయంగా గోడపై రాతలు రాసి వినూత్న ప్రచారం చేపట్టారు. వాల్ రైటింగ్ చేసిన ఆయన, కార్యకర్తలంతా గ్రామాలు, వార్డుల్లో ప్రచారం నిర్వహించాలని పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ నేతలతో సమావేశమై, భారీగా జన సమీకరణ చేయాలన్నారు.

May 5, 2026 / 09:00 PM IST

ఈ పట్టణాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం

GDWL: మిషన్ భగీరథ ప్రధాన పైపులైన్లకు అత్యవసర మరమ్మతులు చేపడుతున్నందున గద్వాల, అయిజ పట్టణాల్లో నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి బుధవారం రాత్రి వరకు ఈ అంతరాయం ఉంటుందని కార్యనిర్వాహక ఇంజనీర్ రవిచంద్ర కుమార్ రెడ్డి తెలిపారు. పైపులైన్ల లీకేజీలను అరికట్టేందుకు ఈ పనులు చేపడుతున్నామని, ప్రజలు సహకరించలన్నారు.

May 5, 2026 / 08:59 PM IST

ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా కృషి చేయాలి: ఎమ్మెల్యే

కృష్ణా: 10వ తరగతి ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించినందుకుగాను, నందివాడ మండలం వెన్ననపూడి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాధవ్, ఉపాధ్యాయులను ఎమ్మెల్యే రాము మంగళవారం అభినందించారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తూ, మంచి ఫలితాలు నమోదు చేస్తున్నాయని ఎమ్మెల్యే అన్నారు. మరింత మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా కృషి చేయాలని సూచించారు.

May 5, 2026 / 08:55 PM IST

బీసీ గురుకులాల్లో ఇంటర్ అడ్మిషన్లకు దరఖాస్తులు

BDK: జిల్లాలో 2026-27 విద్యా సంవత్సరానికి బీసీ గురుకుల కళాశాలల్లో జూనియర్ ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ వి.బ్యూలారాణి తెలిపారు. జిల్లాలోని 10వ తరగతి పాసైన విద్యార్థులు ఈనెల12లోపు http://mjptbcadmissions.org ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో 5బాలుర,6బాలికల గురుకుల కళాశాలలు ఉన్నాయని తెలిపారు.

May 5, 2026 / 08:54 PM IST

ఏసీబీ వలలో పంచాయతీ సెక్రెటరీ

MBNR: మిడ్జిల్ మండలం వెల్జాల పంచాయతీ సెక్రెటరీ ఎం.శరత్ కుమార్ మంగళవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఒక వ్యక్తి ప్లాట్ పేరు మార్పిడి కోసం రూ.30 వేలు డిమాండ్ చేయగా, రూ.20 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అతన్ని పట్టుకున్నారు. ప్రస్తుతం సెక్రెటరీని అధికారులు విచారిస్తున్నారు.

May 5, 2026 / 08:53 PM IST

‘ప్రకృతి వ్యవసాయంతో అధిక దిగుబడులు’

KDP: రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి సహజ పద్ధతుల్లో పంటల సాగుకు రైతులను ప్రోత్సహించాలని ADA రామమోహన్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి (MAO) రామాంజనేయ రెడ్డి సూచించారు. మంగళవారం సింహాద్రిపురం ప్రీ-మాన్సూన్ డ్రైసోయింగ్ విధానంలో సాగు చేసిన పొలాలను పరిశీలించి ప్రాక్టికల్ అవగాహన కల్పించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు.

May 5, 2026 / 08:53 PM IST

‘లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలి’

HYD: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌ను సందర్శించారు. మే 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. సభకు భారీగా జనం తరలివచ్చే అవకాశం ఉన్నందున, ఎటువంటి లోటుపాట్లు లేకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలని పార్టీ శ్రేణులకు, అధికారులకు సూచించారు.

May 5, 2026 / 08:52 PM IST

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల నియామకం

HNK: పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులను టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నియమించారు. దామెర మండల అధ్యక్షుడిగా దుబాసి రాజేందర్, ఆత్మకూరు అధ్యక్షుడిగా రేవూరి జలంధర్ రెడ్డి, పరకాల టౌన్ అధ్యక్షుడిగా శ్రవణ్ కుమార్, పరకాల మండల అధ్యక్షుడిగా కొలపాక చేరాలు(చందు), నడికూడ అధ్యక్షుడిగా మల్లారెడ్డి నియమితులయ్యారు.

May 5, 2026 / 08:51 PM IST

సైబర్ వారియర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం

ఆసిఫాబాద్ జిల్లాలో సైబర్ నేరాల నియంత్రణే లక్ష్యంగా మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో సైబర్ వారియర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సైబర్ మోసాలను గుర్తించే విధానాలు, నివారణ చర్యలపై అధికారులకు అవగాహన కల్పించారు. అనంతరం SP నితికా పంత్ వారికి సైబర్ టీ-షర్టులను అందజేసి మాట్లాడారు. ప్రజల్లో సైబర్ భద్రతపై నిరంతరం చైతన్యం కల్పించాలన్నారు.

May 5, 2026 / 08:50 PM IST

బాల్య వివాహలపై అవగాహన కార్యక్రమం

KDP: కొండాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపురం క్రాస్ వద్ద మంగళవారం సాయంత్రం గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐ పి.రాజా, ఎస్సై జయరాముడు పాల్గొని సైబర్ నేరాలు, బాల్య వివాహాలు, సోషల్ మీడియా దుర్వినియోగం, మహిళా భద్రతపై ప్రజలకు వివరించారు. గ్రామాల్లో చట్టపరమైన అవగాహన పెంపొందించి ప్రశాంత వాతావరణం కాపాడాలని సూచించారు.

May 5, 2026 / 08:50 PM IST

రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: కలెక్టర్ రాజర్షి షా

ADB: అగ్ని ప్రమాదం వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని కలెక్టర్ రాజర్షి షా భరోసా ఇచ్చారు. మంగళవారం కలెక్టర్ బోథ్ మండలంలోని కనుగుట్ట గ్రామంలో పర్యటించి, అగ్నిప్రమాదంలో దగ్ధమైన జొన్న, మొక్కజొన్న పంట పొలాలను పరిశీలించారు. పంట నష్టంపై తక్షణమే సమగ్ర సర్వే నిర్వహించి, బాధిత రైతుల వివరాలతో నివేదిక సమర్పించాలని సూచించారు.

May 5, 2026 / 08:50 PM IST

భద్రకాళి ట్యాంక్‌బండ్‌పై రాణి రుద్రమదేవి విగ్రహావిష్కరణ

WGL: స్మార్ట్ సిటీ నిధులు రూ.84.20 కోట్లతో సుందరీకరించిన భద్రకాళి ట్యాంక్‌బండ్‌పై రాణి రుద్రమదేవి వర్ణ విగ్రహాన్ని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ మంగళవారం ఆవిష్కరించారు. ట్యాంక్‌బండ్‌ను ప్రారంభించిన మంత్రులు పర్యాటకానికి ఇది నూతన ఆకర్షణగా నిలుస్తుందన్నారు. వరంగల్ నగర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.

May 5, 2026 / 08:49 PM IST