• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నేడు కమలాపురంలో పర్యటించనున్న ఎమ్మెల్యే

KDP: కమలాపురం నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమానికి మరొక అడుగు పడనుంది. నేడు MLA పుత్తా చైతన్య రెడ్డి, TDP రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డిల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం ఫైర్ ఇంజన్ వాహనం ప్రారంభంతో కార్యక్రమాలు ప్రారంభమై, TDP ఆఫీసు వద్ద ప్రజా దర్బార్ ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరణ జరుగుతుందని పార్టీ కార్యవర్గ సభ్యులు తెలిపారు.

April 15, 2026 / 07:16 AM IST

ఏకపాద శీర్షాసనం వల్ల కలిగే లాభాలు

ఏకపాద శీర్షాసనం అనేది యోగాలో కష్టతరమైన, అధునాతనమైన భంగిమ. ఇది తలకిందులుగా ఉంటూ, ఒక కాలును తల వెనుకకు ఉంచే ఆసనం. ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది భుజాలు, చేతులు, మెడ, వెన్నెముక కండరాలను బలపరుస్తుంది. పొత్తికడుపుపై ఒత్తిడి పడటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం తగ్గుతుంది. ముఖానికి రక్తప్రసరణ పెరగడం వల్ల ముఖం మీద కాంతి పెరుగుతుంది.

April 15, 2026 / 07:15 AM IST

వెల్లుల్ల ఎల్లమ్మ ఆదాయం ఎంతంటే..?

JGL: మెట్‌పల్లి మండలం వెల్లుల్ల ఎల్లమ్మ ఆలయానికి రూ. 54,273 ఆదాయం వచ్చినట్లు ఈవో కాంతరెడ్డి తెలిపారు. వివిధ సేవ టికెట్స్ ద్వారా రూ. 43,076, అమ్మవారి హుండీల ద్వారా రూ. 11,197 కలిపి మొత్తం రూ. 54,273 ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. లెక్కింపు కార్యక్రమంలో దేవదాయ డివిజన్ పరిశీలకులు రాజ మొగిలి, సిబ్బంది కల్వకుంట్ల అనిల్ రావు పాల్గొన్నారు.

April 15, 2026 / 07:13 AM IST

‘PM జనమన్ పథకం సమగ్ర సర్వే శిక్షణ ప్రారంభం’

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో PM జనమన్ పథకం సమగ్ర సర్వే శిక్షణ ప్రారంభమైందని డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామస్థాయిలో గిరిజనుల వివరాలను సేకరించి సర్వేను సమర్థవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ పథకం ద్వారా గిరిజనుకు ఆధార్, ఆయుష్మాన్ కార్డు, జన్ ధన్ ఖాతాలు, కిసాన్ క్రెడిట్ కార్డులు సేవలు అందుతాయన్నారు.

April 15, 2026 / 07:13 AM IST

కాంగ్రెస్ పీఏసీ సమావేశం.. పార్టీ బలోపేతమే లక్ష్యం

GDWL: జిల్లా కేంద్రంలోని ప్రజా బంగ్లాలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి అధ్యక్షతన రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) సమావేశం మంగళవార జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శి ఎస్.ఏ. సంపత్ కుమార్ హాజరై, పార్టీని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పటిష్టం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.

April 15, 2026 / 07:12 AM IST

ఓఆర్ఆర్‌పై ప్రమాదం.. తండ్రీకొడుకుల మృతి

HNK: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు మృతి చెందారు. పెద్ద అంబర్ పేట్–బొంగులూరు మార్గంలో హన్మకొండ‌కు చెందిన వేద ప్రకాశ్ రెడ్డి కారు అదుపుతప్పి నీటి ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన రెండున్నరేళ్ల కుమారుడు అర్జున్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

April 15, 2026 / 07:10 AM IST

తండ్రి కష్టానికి ఫలితం.. భవాని అద్భుత విజయం

JN: చిల్పూర్ మండలం చిన్న పెండ్యాలకు చెందిన పేరాల భవాని ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచింది. టైలరింగ్ చేస్తూ కుమార్తెను చదివిస్తున్న తండ్రి ప్రభాకర్ కష్టాన్ని గుర్తించి భవాని కష్టపడి చదివి 1000కి 988 మార్కులు సాధించింది. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన భవాని అత్యధిక మార్కులు సాధించడంతో గ్రామస్థులు, పలువురు ప్రముఖులు ఆమెను అభినందించారు.

April 15, 2026 / 07:09 AM IST

నేడు సరూర్ నగర్ రైతుబజార్‌కు సెలవు

RR: సరూర్ నగర్ రైతుబజార్‌కు నేడు సెలవు ఉంటుందని రైతుబజార్ ఈవో స్రవంతి తెలిపారు. ప్రతినెల మూడో బుధవారం సెలవు ఉన్నందున ఈరోజు రైతు బజార్‌లో కూరగాయల క్రయ విక్రయాలు జరగవన్నారు. గురువారం మళ్లీ యధావిధిగా రైతుబజార్‌లో క్రయవిక్రయాలు జరుగుతాయని తెలిపారు. ఈ విషయాన్ని వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.

April 15, 2026 / 07:08 AM IST

ఎండు గంజాయి పట్టివేత.. కేసు నమోదు

BDK: బైక్‌పై అక్రమంగా తరలిస్తున్న కిలో ఎండు గంజాయిని మంగళవారం ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఎస్సై శ్రీహరిరావు వివరాల ప్రకారం..  భద్రాచలం ఆర్టీఏ కార్యాలయం వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, ఒడిశా నుంచి HYDకు గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. వారి నుంచి బైకును, గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

April 15, 2026 / 07:08 AM IST

సాయంత్రం కూటమి నేతల కీలక భేటీ

AP: సీఎం చంద్రబాబు నివాసంలో ఇవాళ సాయంత్రం 5 గంటలకు కూటమి నేతల కీలక సమావేశం జరగనుంది. ఈ భేటీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హాజరుకానున్నారు. మహిళా బిల్లు ఆమోదం తర్వాతి పరిణామాలు, ప్రభుత్వ కార్యక్రమాల అమలు, కూటమి పార్టీల మధ్య సమన్వయంపై ఈ సందర్భంగా చర్చించనున్నారు.

April 15, 2026 / 07:07 AM IST

‘ప్రతి ఒక్కరు రాజ్యాంగ స్ఫూర్తితో నడుచుకోవాలి’

KNR: రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను కరీంనగర్ బస్టాండ్ ఆవరణలోని సమావేశ మందిరంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ రీజినల్ మేనేజర్ బీ. రాజు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తితో నడుచుకోవడమే బాబాసాహెబ్‌కు మనం ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

April 15, 2026 / 07:06 AM IST

‘US ఓపెన్ పికల్‌బాల్ ఛాంపియన్‌షిప్’ లో సత్తా చాటిన HYD

HYD: నగరానికి చెందిన 18 ఏళ్ల నాగ మోక్ష ఎర్రం ప్రతిష్టాత్మక ‘యూఎస్ ఓపెన్ పికల్‌బాల్ ఛాంపియన్‌షిప్’లో కాంస్య పతకం సాధించి, రాష్ట్ర కీర్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. ఐపీఏ నేషనల్స్ 2025లో రెండు స్వర్ణ పతకాలతో రాణించిన మోక్ష, అదే స్ఫూర్తితో అమెరికాలో జరిగిన ఈవెంట్‌లో సత్తా చాటారు. మోక్ష ప్రతిభను ఒలింపియన్ విష్ణువర్ధన్ అభినందించారు.

April 15, 2026 / 07:05 AM IST

నిట్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు పరిశోధన నిధులు

WGL: వరంగల్ నిట్ గణిత విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ వికాస్ శ్రీవాస్తవ ANRF ECRG పరిశోధన నిధులను సాధించారు. క్వాంటం-సేఫ్ సైబర్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ అభివృద్ధికి రూ.50 లక్షలు మంజూరయ్యాయి. AI, మెషిన్ లెర్నింగ్ భద్రతకు సంబంధించిన పరిశోధనలు ఈ ప్రాజెక్ట్ ద్వారా చేపట్టనున్నారు. దీంతో ఆయనకు మంగళవారం నిట్ వరంగల్ యాజమాన్యం అభినందనలు తెలిపింది.

April 15, 2026 / 07:05 AM IST

రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు

VKB: గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని చౌడాపూర్ ఎస్సై రమేశ్ కుమార్ సూచించారు. మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

April 15, 2026 / 07:05 AM IST

పరారీలో ఉన్న నిందితుడు అరెస్ట్

AKP: గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేసినట్లు కసింకోట ఎస్సై లక్ష్మణరావు మంగళవారం తెలిపారు. 2019 డిసెంబర్ నెలలో 165 కిలోల గంజాయి రవాణా చేస్తుండగా పశ్చిమబెంగాల్‌కు చెందిన డెబాసిన్ ఘెరాయ్ పట్టుపడ్డాడు. బెయిల్ పై బయటకు వచ్చిన నిందితుడు కోర్టుకు హాజరు కావడం లేదు. అతనిపై నాన్ బైబిల్ జారీ కావడంతో పశ్చిమ బెంగాల్ వెళ్లి అరెస్టు చేసారు.

April 15, 2026 / 07:04 AM IST