KKD: రాజమహేంద్రవరం నారాయణపురం ప్రాంతానికి చెందిన గుత్తుల అప్పయ్యమ్మ (70) రెండు రోజులుగా బయట తిరుగుతున్నారు. దీంతో స్థానికులు తొలుత ప్రభుత్వ ఆసుపత్రిలోని వన్ స్టాప్ సెంటర్కు, అనంతరం ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రస్తుతం స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్నారు. ఈమె ఆచూకీ తెలిసినవారు పోలీసులను సంప్రదించాలని కోరారు.