AP: విశాఖ- విజయవాడ ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఫ్లైట్ టేకాఫ్ అయిన కాసేపటికే సమస్య తలెత్తడంతో పైలట్ అప్రమత్తమై విమానాన్ని తిరిగి విశాఖలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఇదే విమానంలో YCP MLC బొత్స సత్యనారాయణ కూడా ఉన్నారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఎయిరిండియా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసింది.