SKLM: ఖరీఫ్ నాటికి రైతులకు విత్తనాలు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. యూరియా కొరత రాకుండ ముందస్తు ప్రణాళిక తయారు చేసుకోవాలన్నారు. మంగళవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. పచ్చి రొట్ట ఎరువులను ప్రోత్సహించాలని దీని వలన రసాయన ఎరువులను తగ్గించు కోవచ్చన్నారు.