EG: కొవ్వూరు పట్టణంలో చెత్త నిర్వహణలో నిర్లక్ష్యం ప్రజలప్రాణాలకు ముప్పుగా మారుతోందని స్థానికులు మంగళవారం ఆరోపిస్తున్నారు. 24 వార్డుల్లో పారిశుద్ధ్య కార్మికులు సేకరించిన క్విoటాళ్ల కొద్ది తడి పొడి చెత్తను గోదావరి ఆర్చ్ బ్రిడ్జి వద్ద తగులబెట్టడం వల్ల తీవ్ర కాలుష్యం వ్యాపిస్తోంది. పట్టణ ప్రజలు రోజూ విషపూరిత పొగతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయటున్నారు స్థానికులు.
BHPL: రేగొండ మండలం చెన్నపూర్ గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులను స్థానికులు మంగళవారం అడ్డుకున్నారు. గతంలో అభ్యంతరాలతో నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభించగా, గ్రామానికి రోడ్డు వెడల్పు చేసి సీసీ రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తూ పనులు ఆపేశారు. దీంతో SI దివ్య సంఘటన స్థలానికి చేరుకుని ప్రజలకు సర్ది చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AP: తిరుపతిలోని గరుడ వారధిపై తరచూ జరుగుతున్న ప్రమాదాల నివారణకు జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ ఫ్లైఓవర్పై ద్విచక్ర వాహనాలు, భారీ వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించింది. ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకంటామని పోలీసులు హెచ్చరించారు.
JN: ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తరిగొప్పుల మండలంలోని మరియాపూర్, సోలిపురం, పోతారం గ్రామాల్లో మాదకద్రవ్యాలపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నర్మెట్ట సీఐ తరిగొప్పుల ఎస్సై, పోలీస్ సిబ్బందితో పాటు రెవెన్యూ, మెడికల్, పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులు పాల్గొని మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించారు.
KRNL: తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సావిత్రిబాయి ఫూలే వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఇవాళ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి పాల్గొన్నారు. ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, వైసీపీ సీనియర్ నాయకులు హాజరై ఆమె సేవలను స్మరించారు. అభివృద్ధికి సావిత్రిబాయి ఫూలే చేసిన కృషిని నేతలు గుర్తుచేశారు.
WGL: ఖానాపురం మండలం చిలకమ్మ నగర్ గ్రామంలోని విషాదం చోటు చేసుకుంది. గోవిందు తండాలో తండావాసులు బోనాల పండుగ జరుపుకుంటుండగా మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే బాధితులను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అలుగునూరులో నిబంధనలు ఉల్లంఘిస్తున్న ‘ఉత్తమ్ ఐస్ క్రీమ్’ తయారీ కేంద్రాన్ని జిల్లా ఆహార భద్రతా విభాగం అధికారులు తనిఖీ చేశారు. ప్యాకింగ్పై చిరునామా, FSSAI లైసెన్స్ నంబర్లు లేకపోవడం, తప్పుడు కేటగిరీలో లైసెన్స్ పొందడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు రూ.6,000 విలువైన స్టాక్ను సీజ్ చేసి లైసెన్స్ పొందాలన్నారు.
మినిమమ్ బ్యాలెన్స్ నిబంధన పేరుతో ఖాతాదారుల నుంచి గత మూడేళ్లలో ప్రైవేట్ బ్యాంకులు రూ.11 వేల కోట్లు వసూలు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్కు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. HDFC బ్యాంక్ అత్యధికంగా రూ.3800 కోట్లు, యాక్సిస్ బ్యాంక్ రూ.2,700 కోట్లు, ICICI బ్యాంక్ రూ.1200 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు.
కరీంనగర్ హౌసింగ్ బోర్డులోని యజ్ఞ వరాహ స్వామి క్షేత్రంలో యజ్ఞ వరాహ నిర్మాత భాష్యం విజయ సారథి జయంత్యుత్సవం సందర్భంగా అభిషేకం, వేద పారాయణము, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్చి 12 నుంచి ప్రతి గురువారం 100 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని ఆలయ కమిటీ తెలిపారు.
CTR: పెనుమూరు మండలం, పులికల్లు పంచాయితీ పరిదిలోని గొడుగుమానిపల్లి గ్రామంలో రోడ్డు అధ్వానంగా మారింది. రాముల వారి గుడి నుంచి వినాయకుడి గుడి వరకు చెత్తా, చెదారాల వ్యర్థాలతో రోడ్డు చెత్త కుప్పలా మారింది. అటు వైపు వెళ్లాలంటే ముక్కు మూసుకుని వెళ్లే పరిస్థితి ఏర్పడింది. సంబంధిత అధికారులకు తెలియజేసినా ఫలితం లేదని గ్రామస్థులు వాపోతున్నారు.
KNR: ఆర్టీసీ కరీంనగర్ జోన్ పరిధిలోని బస్ స్టేషన్లు, డిపోలలో ప్రయాణికులకు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని జోన్ ఈడీ పగిడిమర్రి సోలమన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కరీంనగర్ బస్టాండ్ ఆవరణలో సివిల్ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెండింగ్లో ఉన్న మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, వేసవి దృష్ట్యా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
TPT: తిరుపతి భవాని నగర్లోని రమాదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్పై వెంటనే విచారణ జరిపి సీజ్ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. బ్రెయిన్ స్ట్రోక్తో చికిత్స పొందుతూ మృతి చెందిన యువకుడి కుటుంబం నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి, మృతదేహాన్ని ఇవ్వడానికి కూడా రూ.45 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపించారు.
W.G: పోడూరు మండలం కవిటంలో శ్రీ సోమేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణ పనులను ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి PA మోహన్తో కలిసి మంగళవారం పరిశీలించారు. ఆలయ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సతీష్ కుమార్, సొసైటీ అధ్యక్షుడు ఊడిగ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
హీరో మంచు మనోజ్ SMలో సరికొత్త ఫొటోతో సందడి చేశాడు. బ్లాక్ అండ్ వైట్ జిమ్ పిక్లో ఓవైపు తీవ్రమైన అలసటతో, మరోవైపు పవర్ఫుల్గా కనిపిస్తున్నాడు. హెడ్ఫోన్స్, క్యాప్ ధరించి, కఠోర వ్యాయామం తర్వాత నేలపై కూర్చున్నట్టు ఉన్న ఈ ఫొటో వైరల్ అవుతోంది. ఈ ఫొటోపై మనోజ్ స్పందిస్తూ.. ‘కంఫర్ట్ జోన్’ వదిలి, 21 రోజుల పాటు కఠినమైన శిక్షణ తీసుకున్నట్లు తెలిపాడు.
ADB: రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని MLA పాయల్ శంకర్ అన్నారు. మంగళవారం గుడిహత్నూర్ మండల కేంద్రంలో పర్యటించి రైతులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ, రైతు భరోసాను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.