• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఎరువుల దుకాణాల్లో అధికారుల తనిఖీలు

NLG: మిర్యాలగూడలోని ఎరువులు, విత్తనాల దుకాణాల్లో వ్యవసాయ అధికారి ఎం. రుషేంద్రమణి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. స్టాక్ రికార్డులను పరిశీలించి, నాణ్యత లేని విత్తనాలు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు కొనుగోలు చేసే ప్రతి విత్తనానికి రశీదు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. అధిక ధరలకు అమ్మే డీలర్ల లైసెన్స్‌లు రద్దు చేస్తామన్నారు.

May 5, 2026 / 08:48 PM IST

శాంతినగర్‌లో అగ్నిప్రమాదం: తప్పిన భారీ ముప్పు

SRPT: సూర్యాపేట మండల పరిధిలోని ఇవాళ సాయంత్రం శాంతినగర్‌ సమీపంలో గల ఖాళీ స్థలంలో మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమీపంలో ఇళ్లు, దుకాణాలు ఉన్నప్పటికీ, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలను అదుపు చేశారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.

May 5, 2026 / 08:48 PM IST

టీడీపీ కార్యాలయ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

NDL: నంద్యాల పట్టణంలోని మార్కెట్ యార్డ్ గౌడన్‌ ప్రాంగణంలో జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన భవన నిర్మాణానికి బుధవారం భూమిపూజ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి NMD ఫరూక్‌‌తో కలిసి మంగళవారం నందికొట్కూరు టీడీపీ ఇంఛార్జ్ గౌరు వెంకట రెడ్డి, ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పార్టీ కార్యాలయ స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

May 5, 2026 / 08:47 PM IST

మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘దోస్త్’ ప్రవేశాలు

KMM: మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం దోస్త్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి దశ రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్లకు ఈ నెల 7వ తేదీ చివరి గడువు అని ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.రవీంద్రారెడ్డి తెలిపారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, మెరుగైన వసతులు ఉన్న ఈ కళాశాలలో చేరే అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

May 5, 2026 / 08:47 PM IST

శ్రీకాళహస్తిలో వరుస దొంగతనాలు

TPT: శ్రీకాళహస్తిలో ఇటీవలి వరుసగా దొంగతనాలు చోటు చేసుకోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. రెండు నెలల వ్యవధిలో శ్రీరామనగర్ కాలనీలో రెండు చోట్ల దొంగతనాలు జరగగా, బహదూర్‌పేటలోని ఓ ఇంట్లో కూడా చోరీ జరిగిన ఘటనలు నమోదయ్యాయి. ఈ ఘటనలతో స్థానికులు రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

May 5, 2026 / 08:47 PM IST

నూతన అధ్యక్షుడు సీనయ్యకు జనసేన నేతల సన్మానం

NDL: నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన టంగుటూరి సీనయ్యను మంగళవారం జనసేన నాయకులు ఘనంగా సన్మానించారు. జనసేన నేత భాస్కర్ ఆధ్వర్యంలో సీనయ్యను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ.. సీనయ్య సేవా కార్యక్రమాలతో ప్రజల్లో గుర్తింపు పొందారని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు.

May 5, 2026 / 08:45 PM IST

హుజురాబాద్ సింగిల్ విండో ఛైర్మన్‌గా కొండల్ రెడ్డి

KNR: హుజురాబాద్ సింగిల్ విండో ఛైర్మన్‌గా కొండల్ రెడ్డి మంగళవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. పాత పాలకవర్గానికి తిరిగి పదవి బాధ్యతలు స్వీకరించాలని హైకోర్టు ఆదేశించడంతో అధికారులు పాత పాలకవర్గంతో ప్రమాణస్వీకారం చేయించారు. సింగిల్ విండో సీఈవో గోస్కుల వివేకానంద, సిబ్బంది మహేందర్ రెడ్డి, విజయ, తదితరులు పాల్గొన్నారు.

May 5, 2026 / 08:44 PM IST

TTD పరకామణి మాజీ డిప్యూటీ ఈవో మృతి

TPT: టీటీడీ పరకామణి తొలి మహిళా మాజీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బొమ్మారెడ్డి శారద (68) మృతిచెందారు. 2011 నవంబరులో టీటీడీ.. పరకామణి డిప్యూటీ ఈవోగా ఆమెను నియమించింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆమె మృతి పట్ల పలువురు టీటీడీ అధికారులు సంతాపం తెలిపారు.

May 5, 2026 / 08:43 PM IST

ధర్మపురి ఆలయ ఆదాయం రూ.1.88 లక్షలు

JGL: ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో మంగళవారం భక్తుల రద్దీ కొనసాగింది. ఆలయానికి వచ్చిన ఆదాయం వివరాలను ఈఓ శ్రీనివాస్ వెల్లడించారు. టికెట్ల ద్వారా రూ.1,24,382, ప్రసాదాల ద్వారా రూ.53,560, అన్నదానం ద్వారా రూ.10,400 ఆదాయం లభించింది. మొత్తం రోజువారీ ఆదాయం రూ.1,88,342గా నమోదు అయింది.

May 5, 2026 / 08:42 PM IST

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం: MLA

NDL: డోన్ పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద టీడీపీ పట్టణ అధ్యక్షుడు రాఘవేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మంగళవారం ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. వేసవిలో తాగునీటి సౌకర్యం కల్పించడం సామాజిక బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. చలివేంద్రం ద్వారా ప్రయాణికుల దాహార్తిని తీర్చడం అభినందనీయమన్నారు.

May 5, 2026 / 08:40 PM IST

ఆశా డే కార్యక్రమంలో భాగంగా పీహెచ్‌సీ తనిఖీ

పార్వతీపురం మన్యం జిల్లా మొండెంఖల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఉప వైద్యాధికారి డా. కె.వి.ఎస్ పద్మావతి మంగళవారం సందర్శించారు. గర్భిణీల నమోదు, అందుతున్న వైద్య సేవలు, టీబీ, మలేరియా కేసులు, రక్తహీనత పరిస్థితులపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో డా. సిహెచ్ వెంకటేష్, సిబ్బంది వినోద్, జె. తిరుపతిరావు, తదితరులు పాల్గొన్నారు.

May 5, 2026 / 08:40 PM IST

‘విధి వెక్కిరించినా.. అతని సంకల్పం చెదరలేదు’

ADB: విధి వెక్కిరించినా.. అతని సంకల్పం, పట్టుదల ముందు ఓటమి తలవంచింది. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన సాయిచరణ్ ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రమాదం జరిగి రెండు చేతులు కోల్పోయాడు. ఆయన మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఇటీవల జరిగిన పదవ తరగతి పరీక్షల్లో 422 మార్కులు సాధించి అందరి మన్ననలు పొందాడు. ఈ మేరకు సాయిచరణ్‌ను MLA పాయల్ శంకర్ అభినందించి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

May 5, 2026 / 08:38 PM IST

మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలి: ఎమ్మెల్సీ

SRPT: ఈ నెల 10న హైదరాబాద్‌లో జరిగే ప్రధాని మోదీ బహిరంగ సభకు ప్రజలు భారీగా తరలిరావాలని బీజేపీ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈరోజు సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ వైఫల్యాలతో ప్రజలు విసుగు చెందారని, 2028లో తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దేశాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ఆయన అన్నారు.

May 5, 2026 / 08:36 PM IST

విద్య కోసం సైకిళ్లు.. పేద బాలికలకు అందజేత

NLG: మునుగోడు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇవాళ పేద విద్యార్థినులకు సైకిళ్లను పంపిణీ చేశారు. క్లబ్ అధ్యక్షుడు నారబోయిన రవి మాట్లాడుతూ.. విద్యార్థులు లక్ష్యంతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. సీఐ రాములు, తహసీల్దార్ నరేష్, ఎస్సై రవి, సర్పంచ్ రమాదేవి తదితరులు పాల్గొని లయన్స్ క్లబ్ సేవలను అభినందించారు.

May 5, 2026 / 08:36 PM IST

విద్యుత్ సర్క్యూట్‌తో మొక్కజొన్న దగ్దం

NRML: జిల్లా తానూర్ మండలంలోని బోంద్రేట గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో రైతులు షిందే సుదర్శన్, కావేరి, జనార్ధన్లకు చెందిన సుమారు 6 ఎకరాల మొక్కజొన్న పంట పూర్తిగా కాలి బూడిదైంది. అప్పులు చేసి కష్టపడి పండించిన పంట కళ్లముందే అగ్నికి ఆహుతి కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

May 5, 2026 / 08:36 PM IST