KMR: ప్లాస్టిక్ పైపుల ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటన భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులోని హరిహర పాలిమర్స్ ఫ్యాక్టరీలో మంగళవారంచోటుచేసుకుంది. జంగంపల్లి గ్రామం నుంచి దోమకొండ వెళ్లే దారిలో హరిహర పాలిమర్స్ స్క్రాప్ ఫ్యాక్టరీ ఉంది. సుమారు రూ.కోటి వరకు నష్టం జరిగినట్టు బాధితులు పేర్కొంటున్నారు.