KNR: చిగురుమామిడి మండలంలోని లంబాడిపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం ఎంఈవో జయప్రద, ఉపాధ్యాయులు, గ్రామస్థుల సమక్షంలో ఇంటరాక్టివ్ డిజిటల్ ప్యానెల్ బోర్డును ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి గ్రామస్థులు ముందుకు వచ్చి రూ. లక్ష విరాళాలు సేకరించి ఇవ్వడం సంతోషం అని అన్నారు.