• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో అధిక దిగుబడులు’

ASR: ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వేరుశనగ సాగు చేసి, అధిక దిగుబడులు సాధించాలని చింతపల్లి ఏడీఏ తిరుమలరావు రైతులకు సూచించారు. సోమవారం ఏవో మధుసూదనరావుతో చౌడుపల్లి, పశువులబంధ గ్రామాల్లో పర్యటించారు. ఆయా గ్రామాల రైతులు, వ్యవసాయ సిబ్బందితో కలిసి అక్కడ సాగు చేస్తున్న వేరుశనగ పంట పరిశీలించారు. ఖరీఫ్ సీజన్‌లో కూడా వేరుశనగ సాగు చేసేందుకు రైతులు ముందుకు రావాలన్నారు.

April 20, 2026 / 08:49 PM IST

అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం

KMR: అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు గర్భిణీలు బాలింతలకు పౌష్టికాహారం అందించడం జరుగుతుందని ఐసీడీఎస్ సూపర్వైజర్ హరిత చెప్పారు. సోమవారం నాగిరెడ్డిపేట మండలం అక్కంపల్లిలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. క్రమం తప్పకుండా పౌష్టికాహారం తీసుకోవాలనే సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకట గౌడ్ నాయకులు ఉన్నారు.

April 20, 2026 / 08:48 PM IST

వాహనాలను దొంగిలిస్తున్న వ్యక్తి అరెస్ట్

అన్నమయ్య: మదనపల్లెలో టూటౌన్ పోలీసులు కిలాడీ బైక్ దొంగను అరెస్ట్ చేసి 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. లక్కిరెడ్డిపల్లెకు చెందిన మల్లికార్జున అనే నిందితుడు రాయలసీమ వ్యాప్తంగా బస్టాండ్లు, ఆసుపత్రుల వద్ద బైక్‌లు దొంగిలిస్తూ వచ్చాడు. మొత్తం రూ.4.61 లక్షల విలువైన వాహనాలు పట్టుబడినట్లు ఎస్పీ ధీరజ్ తెలిపారు. ప్రజలు వాహన భద్రతపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

April 20, 2026 / 08:47 PM IST

సింహాచలంలో భక్తుల కోలాహలం

AP: సింహాచల క్షేత్రంలో శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి నిజరూప దర్శనం భక్తులకు కనువిందు చేస్తోంది. సా.2:30 గంటలకే సుమారు 70 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక దర్శనాలతో పాటు ధర్మ దర్శనం లైన్లలో భక్తులు క్రమశిక్షణతో వేచి ఉన్నారు. ఎండ వేడి దృష్ట్యా క్యూలైన్లలోనే మజ్జిగ, తాగునీరు, పాలు పంపిణీ చేస్తూ దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది.

April 20, 2026 / 08:46 PM IST

NTRకు జీవన్ రెడ్డి వెన్నుపోటు పొడిచారు: రేవంత్

TG: జీవన్ రెడ్డి చరిత్ర, ఆయన వెనకున్న మచ్చలన్నీ తనకు తెలుసు అని సీఎం రేవంత్ అన్నారు. మంత్రి పదవి ఇచ్చిన NTRకు జీవన్ రెడ్డి వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. NTRకు వెన్నుపోటు పొడిచి నాదెండ్ల భాస్కర్‌ వెంట పోయారని విమర్శించారు. 40 ఏళ్ల పాటు తన కుటుంబానికి ఎన్నో పదవులు ఇచ్చుకున్నారని మండిపడ్డారు. 14 సార్లు కాంగ్రెస్ B ఫామ్ ఇస్తే.. మోసం చేసి వెళ్లిపోయారని ధ్వజమెత్తారు.

April 20, 2026 / 08:46 PM IST

ఘనంగా AP CM చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

MHBD: పెద్ద గూడూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ పార్లమెంట్ కన్వీనర్ కోండపల్లి రామచందర్ రావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హాస్పిటల్‌లో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో TDP నేతలు ఉన్నారు.

April 20, 2026 / 08:46 PM IST

ప్రపంచ స్థాయిలో మెరిసిన మార్కాపురం వాసి

మార్కాపురం మండలం గజ్జలకొండకు చెందిన నాసరయ్య థాయిలాండ్లో ప్రపంచ స్థాయి మాస్టర్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్‌లో గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించారు. 100 మీటర్ల పరుగులో గోల్డ్, 5000 మీటర్ల వాక్ రేస్‌లో సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు. తండ్రి మరణించిన ఆరు నెలల్లోనే థాయిలాండ్‌కు వెళ్లే అర్హత సాధించాడు. తన తండ్రిలేని లోటును తీర్చుకుంటూ తల్లి ప్రోత్సాహంతో థాయిలాండ్ చేరాడు.

April 20, 2026 / 08:45 PM IST

వృద్ధాశ్రమంలో సీఎం జన్మదిన వేడుకలు

PLD: నరసరావుపేట శ్రీనివాస్ నగర్ వృద్ధాశ్రమంలో సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. చదలవాడ అరవింద బాబు వృద్ధులను సందర్శించి అందించారు. వారి ఆశీస్సులు పొందడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

April 20, 2026 / 08:45 PM IST

‘జిల్లాకు ఐదు పశు ఔషది కేంద్రాలు మంజూరు’

VZM: జిల్లాకు ఐదు పశు ఔషది కేంద్రాలు మంజూరైనట్లు కలెక్టర్ ఎస్. రామ్ సుందర్ రెడ్డి తెలిపారు. విజయనగరం, చీపురుపల్లి, బొబ్బిలి, రామభద్రపురం, గజపతినగరాలలో ఈ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కేంద్రాల ద్వారా పశువులకు కావలసిన జనరిక్ మందులు తక్కువ ధరలకు రైతులకు అందించడం జరుగుతుందన్నారు. కావున ఈ అవకాశాన్ని పాడి రైతులందరూ వినియోగించుకోవాలన్నారు.

April 20, 2026 / 08:44 PM IST

‘ప్రతి ఫిర్యాదును పరిశీలించి వాటి పరిష్కారానికి కృషి చేస్తా’

NTR: ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకుప్రభుత్వం చేపట్టిన PGRS కార్యక్రమాన్ని నందిగామ RDO పోసి బాబు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 14 వినతులు వచ్చాయన్నారు. ఇందులో రెవెన్యూ-7, సర్వే-3, మున్సిపాలిటీ -1, పోలీసు – 2, నీటి పారుదలపై 1 అర్జీ వచ్చిందన్నారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని RDO పేర్కొన్నారు.

April 20, 2026 / 08:44 PM IST

కొనుగోలు కేంద్రాల వద్ద కౌలు రైతుల ఇబ్బందులు

KMM: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల వద్ద కౌలు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు స్వర్ణ సుబ్బారావు అన్నారు. ఓటీపీ పేరుతో షరతులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని, వెంటనే ఆ నిబంధనలను రద్దు చేయాలని సోమవారం కలెక్టరేట్లో రైతులతో కలిసి అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందజేశారు.

April 20, 2026 / 08:41 PM IST

కేసీఆర్‌ను పాపాల భైరవుడు అంటూ రేవంత్ సెటైర్లు

TG: 3.5 కోట్ల మంది పేదలకు సన్నబియ్యం ఇస్తున్నామని CM రేవంత్ తెలిపారు. పేదలకు సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచనే ఎవరికైనా వచ్చిందా? అని నిలదీశారు. ప్రజాపాలన పోవాలని.. పాపాల భైరవుడు రావాలని ఒక పెద్దమనిషి అంటున్నారని మండిపడ్డారు. ఫామ్‌హౌస్‌లో పండుకునే పాపాల భైరవుడు మళ్లీ ఎందుకు రావాలని ప్రశ్నించారు. పాపాల భైరవుడు ఎందుకు రావాలో.. పార్టీ మారుతున్న పెద్దమనిషి చెప్పాలన్నారు.

April 20, 2026 / 08:39 PM IST

హైడ్రాను తొలగిస్తాం: కేసీఆర్

TG: BRS ప్రభుత్వం వచ్చిన మొదటి రోజుల్లోనే హైడ్రాను ఎత్తేస్తామని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. మొదటి సంతకంతోటే హైడ్రాను తీసి చెరువులో పడేస్తామన్నారు. తాము 46వేల చెరువులను అభివృద్ధి చేశామని.. ఒక్క ఇళ్లు అయినా కూలగొట్టమా? అని ప్రశ్నించారు. మూసీని బాగు చేస్తే స్వాగతిస్తామని.. కానీ అందుకు 15వేల ఇళ్లు కూలగొట్టడం ఎందుకు అని నిలదీశారు. మూసీ పరివాహక ప్రజలకు కంటి మీద లేదన్నారు.

April 20, 2026 / 08:39 PM IST

‘సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవాలి’

శ్రీకాకుళం నగర ప్రజలు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హెచ్. కూర్మారావు అన్నారు. ఈ మేరకు సోమవారం మున్సిపల్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వీయగణన ఈ నెల 30వ తేదీ వరకు జరుగుతోందన్నారు. అలాగే, ప్రతీ ఇంటి నుండి జనగణన ఉండాలన్నారు.

April 20, 2026 / 08:37 PM IST

పలు అభివృద్ధి పనులకు మంత్రి గొట్టిపాటి శ్రీకారం

AP: తూ.గో. జిల్లాలో రూ.485 కోట్ల విద్యుత్ పనులకు మంత్రి గొట్టిపాటి శ్రీకారం చుట్టారు. రాజమండ్రిలో రూ.96.90 కోట్లతో భూగర్భ కేబుల్ వ్యవస్థకు శంకుస్థాపన చేశారు. కడియం, బొమ్మూరులో కొత్త సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌కో నిలయాలను ప్రారంభించారు. వడెసలేరులో ‘పీఎం సూర్యఘర్’ పథకాన్ని ప్రారంభించిన ఆయన, గోదావరి పుష్కరాల పనులను రెండు నెలల ముందే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

April 20, 2026 / 08:37 PM IST