ADB: రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని MLA పాయల్ శంకర్ అన్నారు. మంగళవారం గుడిహత్నూర్ మండల కేంద్రంలో పర్యటించి రైతులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ, రైతు భరోసాను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వరంగల్ కమిషనరేట్ పరిధిలోని సిటీ ఆర్ముడ్ విభాగంలో సిటీ గార్డ్గా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ వెంకటరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కాజీపేట ఫాతిమా జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలైయ్యాయి. వెంటనే స్థానికులు చికిత్స కోసం సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.
AKP: ఎలమంచిలి మండలం ఏటికొప్పాకలో ఈనెల 8న నాటు తుపాకీ ప్రమాదవశాత్తు పేలి ఆడారి కౌశిక్ (12) మృతి చెందిన ఘటనలో మంగళవారం ఇద్దరిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ మోహన్ రావు తెలిపారు. లైసెన్స్ లేకుండా కె. సూరిబాబు వద్ద రెండు నాటు తుపాకులు కలిగి ఉన్నట్లు తెలిపారు. సూరిబాబు కొడుకు తన స్నేహితులను ఇంటికి తీసుకువెళ్లి నాటు తుపాకీలు చూపిస్తున్న సందర్భంగా ఒకటి మిస్ ఫైర్ అయిందని పేర్కొన్నారు.
VZM: కొత్తవలస ఎన్జీవో భవనంలో మంగళవారం జరిగిన 20 మందితో నూతన ఏపీజేఏసి కమిటీని ఎన్నుకొన్నారు. ఏపీజేఎసి ఛైర్మన్గా జే.వీ.ప్రసాదరావు ఎన్నికవ్వగా, కార్యదర్శిగా ఎం. కుమార్ నియమితులయ్యారు. నూతన కమిటీ ఏపీజేఏసి ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కొత్తవలస మేజర్ పంచాయతీ కార్యాలయంలో శానిటరీ సూపర్వైజర్గా విధులు నిర్వహిస్తున్న MVRL ప్రసాద్ నియమితులయ్యారు.
NRPT: కృష్ణ మండలం గూడెబళ్లూరు గ్రామానికి చెందిన పలువురు యువకులు మంగళవారం జనసేన పార్టీలో చేరారు. మక్తల్ ఇంఛార్జ్ డాక్టర్ మణికంఠ గౌడ్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై వారు పార్టీ కండువా కప్పుకున్నారు. యువత అంతా కలిసి ప్రజా సమస్యలపై పోరాడి, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఈ సందర్భంగా మణికంఠ గౌడ్ పిలుపునిచ్చారు.
NZB: ప్రతిఒక్కరూ భక్తిభావాన్ని అలవర్చుకోవాలని పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. నిజామాబాద్ నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ దీక్షా స్వాములకు హనుమాన్ జంక్షన్ ఆలయంలో మంగళవారం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పీసీసీ చీఫ్ స్వయంగా హనుమాన్ స్వాములకు వడ్డించారు. వారితో కలిసి భోజనం చేశారు.
ప్రకాశం: కంభం మండలంలోని ఎర్రబాలెం గ్రామానికి రూ.1.50 కోట్ల వ్యయంతో నిర్మించిన తారురోడ్డు పనులు పూర్తయ్యాయి. రోడ్డు నిర్మాణం పూర్తవడంతో గ్రామ ప్రజలు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డిని శాలువా కప్పి, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
PPM: మున్సిపాలిటీ పరిధిలోని బహుళ అంతస్తుల భవనాల్లో నివసిస్తున్న ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మున్సిపల్ యంత్రాంగం చిత్తశుద్ధితో ఉందని మున్సిపల్ కమిషనర్ జీ.శ్రీనివాసరాజు మంగళవారం తెలిపారు. ఓ పత్రికలో వచ్చిన కథనానికి బహుళ అంతస్తులు అందని వసతులపై ఆయన పై విధంగా స్పందించారు .ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా యంత్రాంగం కృషి చేస్తుందన్నారు.
ATP: గుత్తి కోట ఉత్సవాలను ఈనెల 14, 15 తేదీల్లో ఘనంగా నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్ వెల్లడించారు. కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. గుత్తి ఫుట్బాల్ గ్రౌండ్లో రెండు రోజులపాటు ఈ ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. జిల్లా ఖ్యాతి పెరిగేలా సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
TG: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఎయిర్పోర్టుకు రావాల్సిన 13 విమానాలు, ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరాల్సిన 12 విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం 25 సర్వీసులు నిలిచిపోయాయి. ప్రయాణికులు తమ ప్రయాణ వివరాలను విమానయాన సంస్థల ద్వారా సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
గుంటూరు సంగడిగుంటలోని శ్రీ సూర్యతేజ పబ్లిక్ స్కూల్లో ఉపాధ్యాయురాలు 1వ తరగతి విద్యార్థిని చెంపలపై కొట్టిందన్న ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మండల విద్యా అధికారి (గుంటూరు తూర్పు) షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఘటనపై పూర్తి వివరణను ఒక రోజు లోపు సమర్పించాలని పాఠశాల యాజమాన్యాన్ని ఆదేశించారు. వివరణ ఇవ్వకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
NRML: ఈ నెల 12న సారంగాపూర్ మండలం చించోలి (బి) గ్రామంలోని ఆదిత్య గార్డెన్స్లో సర్పంచ్లు, మున్సిపల్ కౌన్సిలర్లకు 99 రోజుల ప్రత్యేక కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పిస్తామన్నారు.
NRML: ఈ నెల 12న సారంగాపూర్ మండలం చించోలి (బి) గ్రామంలోని ఆదిత్య గార్డెన్స్లో సర్పంచ్లు, మున్సిపల్ కౌన్సిలర్లకు 99 రోజుల ప్రత్యేక కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పిస్తామన్నారు.
MNCL: చదువే మనిషికి జీవం కావాలని, విద్యను ఇష్టపడుతూ చదవాలని పీఎంశ్రీ పాఠశాలల ప్రేరణాత్మక వక్త, రాష్ట్రపతి అంతర్జాతీయ అవార్డు గ్రహీత గుండెటి యోగేశ్వర్ అన్నారు. మంగళవారం జైపూర్ మండలం టేకుమట్ల పీఎంశ్రీ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం “చదువు.. బడి.. తల్లిదండ్రులు.. పరీక్షలు” అనే అంశంపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.