E.G: కడియం మండలం దుళ్ల రైతు సేవా కేంద్రం వద్ద జరుగుతున్న జాతీయ సేవా పథకం కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. రాజమండ్రిలోని వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ పి.ఎ.విశాలాక్షి దేవి మాట్లాడుతూ.. మట్టి నమూనాల సేకరణ పైన రైతులకు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించారు. మితిమీరిన పురుగు మందులు, ఎరువులు వినియోగం వల్ల పంటకు ఉపయోగం కంటే నష్టం ఎక్కువ జరుగుతుందన్నారు.