SRH హెడ్ కోచ్ డేనియల్ వెటోరి గుడ్ న్యూస్ చెప్పాడు. గాయంతో KKR మ్యాచ్కు దూరమైన స్టార్ ఆల్రౌండర్ నితీష్ రెడ్డి ప్రస్తుతం కోలుకున్నట్లు తెలిపాడు. రేపు ఉప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరగబోయే మ్యాచ్లో నితీష్ బరిలోకి దిగబోతున్నట్లు వెటోరి స్పష్టం చేశాడు. గత మ్యాచ్లో నితీష్ స్థానంలో ఆడిన స్మరణ్ రవిచంద్రన్(4) ఆకట్టుకోలేకపోయాడు.
TPT: నాగలాపురం వేదనారాయణ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
SKLM: హెల్మెట్ ధారణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మంగళవారం కాశీబుగ్గ పట్టణంలో అభయం హెల్మెట్ ర్యాలీ నిర్వహించారు. డీఎస్పీ టి భవాని మూడు రోడ్లు కూడలి వద్ద అభయం హెల్మెట్ బ్యాంక్ ప్రారంభించి వాహనదారులకు హెల్మెట్లు అందజేశారు. ప్రజలంతా హెల్మెట్ ధారణను అలవాటు చేసుకుని, రోడ్డు భద్రతకు సహకరించాలని పోలీసు అధికారులు సూచించారు.
JN: ఈ నెల 10న నిర్వహించే ప్రధానమంత్రి నరేంద్రమోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ వెంకటేశ్వర్లు అన్నారు. రఘునాథపల్లిలో బీజేపీ ముఖ్య నేతల సమావేశంలో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. మండలంలోని ప్రజలు అధిక సంఖ్యలో సభకు హాజరుకావాలని, బీజేపీ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
ASF: కౌటాలలోని రైతు వేదికలో బుధవారం ఉదయం 9 గంటలకు రైతు వారోత్సవాల సభ నిర్వహించనున్నట్లు AO ప్రేమల మంగళవారం తెలిపారు. ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా ఈ సదస్సు ఏర్పాటు చేశారు. PACS, సహకార బ్యాంకు ద్వారా లభించే స్వల్ప, దీర్ఘకాలిక రుణాలు, మార్కెటింగ్ అవకాశాలపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. ఈ మేరకు రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
NRML: బాసర ఐఐఐటీను మంగళవారం జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సందర్శించారు. విద్యార్థులకు నైపుణ్యాలతో కూడిన నాణ్యమైన విద్య అందించాలని అధికారులను ఆదేశించారు. ఆధునిక బోధన పద్ధతులు అమలు చేసి, ఉద్యోగ అవకాశాలు ఉన్న రంగాల్లో విద్యార్థులను ప్రోత్సహించాలని సూచించారు. ఈ క్యాంపస్లో వసతి, ఆహారం, త్రాగునీటి వంటి సదుపాయాలు మెరుగుపరచాలని తెలిపారు.
W.G: జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్స్ ద్వారా భూ సమస్యల పరిష్కారం వేగవంతమైందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 632 దరఖాస్తులు అందగా, అందులో 235 పరిష్కరించామని, 114 దరఖాస్తులను నిబంధనల మేరకు తిరస్కరించామని చెప్పారు. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న 283 దరఖాస్తులను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
HYD: సికింద్రాబాద్లో అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టును రైల్వే పోలీసులు రట్టు చేశారు. ఒడిశా నుంచి పూణేకు 14 కిలోల గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి, రూ. 7.16 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఒక్కో ట్రిప్కు రూ.7 వేల ఒప్పందంతో నిందితుడు ఈ అక్రమ రవాణాకు పాల్పడగా, ప్రధాన నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలిపారు.
JGL: కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మల్యాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రాలకు వచ్చిన వారి ధాన్యాన్ని మ్యాచర్ వచ్చిన వెంటనే ఆలస్యం లేకుండా తూకం వేయాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
CTR: వెదురుకుప్పం, దేవరగుడిపల్లిలో పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. మల్బరీ సాగుతో అధిక ఆదాయం వస్తుందని జాయింట్ డైరెక్టర్ పద్మమ్మ తెలిపారు. పట్టు సాగుకు సబ్సిడీలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, రైతులు పాల్గొన్నారు.
RR: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం మంగళవారం మూసాపేటలో మెరుపు దాడి చేసింది. ఒక గదిలో నిల్వ ఉంచిన 6.43 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ. 4 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
GDWL: ప్రముఖ తత్వవేత్త, శాస్త్రీయ సోషలిజం పితామహుడు కార్ల్ మార్క్స్ 208వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం గద్వాల ప్రజాసంఘాల నాయకులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. నాయకులు మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్త కార్మిక వర్గ విముక్తికి మార్క్స్ సిద్ధాంతాలే దిక్సూచి అని కొనియాడారు. ఆయన ప్రపంచాన్ని విముక్తిని వైపు మళ్ళించారన్నారు.
AKP: పాయకరావుపేట మండలం గుంటపల్లి జడ్పీ హైస్కూల్కు చెందిన విజయోత్సవ యాత్రను మంగళవారం నిర్వహించారు. ముందుగా పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను జనసేన సమన్వయకర్త గెడ్డం బుజ్జి స్వీట్లు పంచి శాలువాలు కప్పి సత్కరించారు. అనంతరం గ్రామం నుంచి పీఎల్ పురం,వడ్డిమెట్ట, సీతారాంపురం గ్రామాల్లో విద్యార్థులు విజయోత్సవ యాత్ర చేపట్టారు.
KMM: గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ వల్ల ఉత్పన్నమైన భూ సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం నేలకొండపల్లి మండలం మంగళగూడెంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఆయన మాట్లాడుతూ.. పదేళ్లుగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు.
AKP: మాడుగుల మండలం ఓమ్మలిలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మంగళవారం పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో రైతులకు సంబంధించిన పాసుపుస్తకాలపై మాజీ సీఎం జగన్ ఫోటో ముద్రించి రైతును అనేక ఇబ్బందులు గురి చేశారన్నారు. నేడు కూటమి ప్రభుత్వంలో రాజముద్ర కలిగిన పాసుపుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.