SRD: మండల కేంద్రమైన కంగ్టిలో నిర్వహించిన సెన్సస్ శిక్షణ కార్యక్రమం మంగళవారం ముగిసింది. సెన్సస్ 2027లో భాగంగా గత మూడు రోజుల నుంచి ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు. ట్రైనర్లు రహీం, సంగు శెట్టి 48 మందికి జనాభా లెక్కల ప్రక్రియలో భాగంగా తొలుత ఇండ్ల గణన కోసం చేపట్టాల్సిన సర్వే ప్రక్రియపై ఇచ్చిన శిక్షణ విజయవంతంగా ముగిసింది.
ELR: చింతలపూడి బస్టాండ్ ఆధునికరణ పనులను ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రూ. 50 లక్షల వ్యయంతో చేపట్టబడుతున్న పనుల పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలించి, నాణ్యత విషయంలో రాజీ పడకుండా వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా బస్టాండ్ను ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేయాలన్నారు.
MBNR: తమ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తాము అమలు చేసే ప్రభుత్వ పథకాలు కాగితాలకు పరిమితం కావని డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని 51వ డివిజన్లో మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.
WGL: గ్రామాల్లో మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, వేసవిలో నీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని MLA ప్రకాష్ రెడ్డి అన్నారు. సంగెంలో ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. గ్రామాలలో ముఖ్యంగా శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, లైటింగ్ వ్యవస్థ పై పంచాయతీ కార్యదర్శిలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు.
NDL: నీతి ఆయోగ్ ‘దివ్య భారత్’ నివేదికలో రాష్ట్ర పర్యాటకానికి పెద్దపీట వేసింది. అరకు, పాపికొండలు, గండికోట ప్రకృతి అందాలను, తిరుమల, శ్రీశైలం వంటి క్షేత్రాలను ప్రశంసించింది. పూతరేకులు, ఉలవచారు వంటి వంటకాలను ప్రత్యేకంగా ప్రస్తావించింది. పర్యాటకులు అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో ఏపీని సందర్శించాలని 13 పేజీల నివేదిక, ప్రత్యేక వీడియో ద్వారా సూచించింది.
KRNL: జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్పై అనవసర విమర్శలు చేస్తే సహించబోమని ఇవాళ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెంకప్ప హెచ్చరించారు. ఆలూరు ఆర్అండ్బీ అతిథి గృహంలో జరిగిన జనసేన కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడిపై విమర్శలు తగవని అన్నారు.
MDK: మెదక్ మున్సిపల్ కార్యాలయంలో జనగణన డైరెక్టర్ భారతి హొళ్లికేరీ, కలెక్టర్ ప్రతిమా సింగ్ సమీక్ష నిర్వహించారు. జనగణన-2027ను సిబ్బంది బాధ్యతాయుతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. తొలిసారి డిజిటల్ విధానంలో జరుగుతున్న ఈ ప్రక్రియలో మే 11 నుండి ఇండ్ల గణన ప్రారంభమవుతుందని తెలిపారు. ఏప్రిల్ 26న స్వీయ గణన చేసుకోవాలని పిలుపునిచ్చారు.
KDP: మైదుకూరు సబ్ డివిజన్ నేర సమీక్షలో ఎస్పీ విశ్వనాథ్ రౌడీ షీటర్లపై కఠిన నిఘా ఉంచాలని ఆదేశించారు. అక్రమ మద్యం, బెట్టింగ్, గ్యాంబ్లింగ్పై దాడులు చేసి కేసులు నమోదు చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు అవగాహనతో పాటు డ్రంకెన్ డ్రైవ్, ఓవర్ స్పీడ్పై చర్యలు తీసుకోవాలని తెలిపారు. సీసీ కెమెరాల పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీ పేర్కొన్నారు.
W.G: పాలకోడేరు మండలం విస్సాకోడేరులో ఇవాళ ‘పోషణ పక్వాడ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ నాగరాణి హాజరయ్యారు. పుట్టబోయే పిల్లల శారీరక, మానసిక అభివృద్ధికి గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. గర్భిణీలు, బాలింతలు సరైన పోషకాహారం తీసుకోవడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని పేర్కొన్నారు.
ATP: గుంతకల్లు మండలం కసాపురంలోని శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చే భక్తాదుల సౌకర్యార్థం మంగళవారం మెయిన్ గేట్ నుంచి ఆలయం వరకు సీసీ రోడ్డు మీద కూల్ పెయింట్ను వేసినట్లు ఆలయ ఈవో విజయ రాజు తెలిపారు. ఈవో మాట్లాడుతూ.. వేసవి కాల దృష్ట్యా ఆలయానికి నడిచి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఈ కూల్ పెయింట్ను వేశామన్నారు.
అన్నమయ్య: ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో SERP–వెలుగు–DRDA ద్వారా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి VOAలకు 5G స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. మహిళల అభ్యర్థనపై సిమ్ కార్డులు, మొదటి నెల రీచార్జ్ను స్వంత నిధులతో అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ నిర్ణయంతో మహిళల్లో ఆనందం వ్యక్తమైందన్నారు. డిజిటల్ సేవల వినియోగంతో మహిళలు మరింత సాధికారత సాధిస్తారని తెలిపారు.
BDK: జిల్లాలో విద్యా వ్యవస్థను మరింత మెరుగుపరచేందుకు వచ్చే విద్యా సంవత్సరానికి ముందస్తు కార్యాచరణ సిద్ధం చేయాలని డీఈఓ బి. నాగలక్ష్మి పేర్కొన్నారు. సమీక్షా సమావేశంలో గత సంవత్సర ఫలితాలు, లోపాలు విశ్లేషించి పాఠశాల స్థాయిలో లక్ష్యాలను నిర్ణయించుకోవాలని సూచించారు. నమోదు, మౌలిక సదుపాయాలు, పెండింగ్ పనులపై అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.
NLR: బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన చిన బాబును వైస్ చైర్మన్ పటాన్ నస్రిన్, టీడీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు. పట్టణంలో దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఖాజా నగర్లోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యలను పరిష్కరిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు.
కోనసీమ: ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని సహజ యోగ ధ్యాన కేంద్రం స్టేట్ కో-ఆర్డినేటర్ రామకృష్ణ పేర్కొన్నారు. అమలాపురంలో నూతన సహజ యోగ ధ్యాన కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. 1970 లో నిర్మల దేవి సహజ యోగ కేంద్రాన్ని స్థాపించారన్నారు. ప్రపంచవ్యాప్తంగా ధ్యానం ప్రసిద్ధి చెందిందని, అందరూ ధ్యానం చేయాలన్నారు.
టాలీవుడ్లో 2027 సమ్మర్ సీజన్లో భారీ చిత్రాలు అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. మార్చి 5న ప్రభాస్ ‘స్పిరిట్’, ఏప్రిల్ 7న మహేష్ బాబు ‘వారణాసి’ రిలీజ్ కానున్నాయి. తాజాగా.. NTR-ప్రశాంత్ నీల్ చిత్రం జూన్ 11న విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు. ముగ్గురు స్టార్ హీరోలు వేసవిలో పోటీ పడుతుండటంతో.. విజేతగా ఎవరు నిలుస్తారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.