AP: ఒకప్పుడు కోడి కత్తి అని YCPని విమర్శించిన పవన్.. ఇప్పుడు తెలంగాణకు వెళ్లి చెరువులో పడ్డ కోడిలా కొట్టుకుంటున్నారని మాజీ మంత్రి పేర్నినాని ఫైరయ్యారు. జగన్ కాలిగోటికి కూడా చంద్రబాబు సరిపోరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమరావతి పేరుతో ప్రజలను TDP మోసం చేస్తోందని, ఇక్కడ రూ.60 వేల కోట్ల దోపిడీ జరిగిందని ఆరోపించారు. దోచుకోవడం తప్ప కూటమి నేతలకు AP అభివృద్ధి పట్టదని విమర్శించారు.