SRPT: అనంతగిరి పీఏసీఎస్ ద్వారా రైతులకు 50 శాతం సబ్సిడీపై జీలుగ పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. 30 కిలోల బస్తాకు రైతు వాటాగా రూ.2,452.50 చెల్లించాల్సి ఉంటుందని పీఏసీఎస్ సీఈవో సైదులు తెలిపారు. రైతులు ఆధార్ కార్డు, పట్టాదారు పాస్బుక్ జిరాక్స్ సంఘాన్ని సంప్రదించాలని సూచించారు. ఈ మేరకు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కరీంనగర్ జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 40 మంది డీలర్లకు 48 వారాలు డీఏఈఎస్ఐ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. విత్తనాల, ఎరువుల కోసం వచ్చే రైతులకు సరైన సలహాలు సూచనలు ఇవ్వాలని ఆమె అన్నారు. రైతులు డీలర్లను నమ్ముతారని, వారికి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు విక్రయించాలన్నారు. డీలర్లకు శిక్షణ సర్టిఫికెట్లు అందజేశారు.
NLR: భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ నెల 4 నుంచి 6వ తేదీ వరకు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. జూన్ 4న గూడూరుకు చేరుకుని వెంకటాచలం మండలంలోని స్వర్ణ భారత్ ట్రస్టుకు వెళతారు. అదే రోజు నెల్లూరులో జరిగే ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. 5న పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.
బాలీవుడ్ హీరో అజయ్ దేవ్గణ్ నటిస్తున్న ‘దృశ్యం 3’ మూవీ షూటింగ్ పూర్తయినట్లు దర్శకుడు అభిషేక్ పాఠక్ తాజాగా ప్రకటించాడు. గత కొన్ని నెలలుగా చిత్ర బృందం ఎంతో కష్టపడి ఈ కథకు ప్రాణం పోసిందని తెలిపాడు. అయితే, హిందీ ప్రేక్షకులకు ఒక బిగ్ సర్ప్రైజ్ ఇస్తూ.. ఒరిజినల్ మలయాళ వెర్షన్తో పోలిస్తే, ఈ హిందీ చిత్రం ముగింపులో కొన్ని కీలక మార్పులు చేసినట్లు వెల్లడించాడు.
TG: ప్రజాస్వామ్యంలో ఎవరైనా సభలు పెట్టుకోవచ్చని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు అన్నారు. జనసేన సభకు హైదరాబాద్లో అనుమతి ఇవ్వకపోవడం అప్రజాస్వామిక ధోరణి అన్నారు. కాంగ్రెస్ ఎమర్జెన్సీ మైండ్సెట్కు ఇది నిదర్శనమని అభివర్ణించారు.కాంగ్రెస్ నిర్ణయాన్ని ఎన్డీయేగా మేం తప్పుబడుతున్నామని ఆయన పేర్కొన్నారు.
అన్నమయ్య: మంగళగిరిలో సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ రాష్ట్రస్థాయి ఎస్ఐఆర్ వర్క్షాప్ మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాదర్, నాగూర్ హాజరయ్యారు. ఓటర్ల జాబితా పునఃపరిశీలన, పార్టీ బలోపేతంపై సీఎం దిశానిర్దేశం చేశారు. పార్టీ క్రమశిక్షణతో పనిచేసి ప్రతి అర్హుడైన ఓటరు పేరు జాబితాలో ఉండేలా కృషి చేస్తామని నేతలు తెలిపారు.
MDCL: గండిమైసమ్మలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు జెండా ఆవిష్కరించి అమరవీరులకు నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమ త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్ర అభివృద్ధికి కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
GDWL: ఎర్రవల్లి మండలం వల్లూరు గ్రామానికి చెందిన రెడ్డిపోగు నాగన్నకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుండి రూ.11,500 ల ఆర్థిక సహాయం అందింది. మంగళవారం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు లబ్ధిదారుని కుటుంబ సభ్యులకు ఈ చెక్కును అందజేశారు. ఆపద కాలంలో పేదలకు సీఎంఆర్ఎఫ్ నిధులు ఎంతో భరోసానిస్తాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.
KKD: పెద్దాపురం పట్టణంలో పార్సిల్ సర్వీసులను పెద్దాపురం డీఎస్పీ తిలక్ మంగళవారం అకస్మికంగా తనిఖీ చేశారు. కొరియర్ సర్వీస్ ద్వారా ఏ వస్తువులు ఎగుమతి దిగుమతి అవుతున్నాయో రికార్డులను తనిఖీ చేశారు. ప్రభుత్వ నిబంధలను ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని డిఎస్పీ తిలక్ కొరియర్ సర్వీస్ నిర్వాహకులను సూచించారు.
BDK: కొత్తగూడెం ప్రగతి మైదానంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజల కలలు సాకారం అవుతున్నాయని ఆమె పేర్కొన్నారు.
SRPT: కర్ల రాజేశ్ కుటుంబానికి బీఆర్ఎస్ అండగా నిలిచిందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రకటించిన రూ.5 లక్షల ఆర్థిక సహాయం చెక్కును బొల్లం మల్లయ్య యాదవ్, రాజేష్ తల్లి కర్ల లలితమ్మకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి తప్పకుండా న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామన్నారు.
NZB: సిరికొండ మండలం చీమన్పల్లిలో ఓ ఇంటి ఆవరణలో నిల్వ ఉంచిన 16 టేకు దుంగలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పాకాల గ్రామానికి చెందిన మాలావత్ గోపి అడవిలో నుంచి టేకు దుంగలు నరికి తీసుకొచ్చినట్లు గుర్తించామన్నారు. ఈ ఘటనపై మాలావత్ గోపి, శ్రీనివాస్పై కేసు నమోదు చేసినట్లు సిరికొండ ఫారెస్ట్ రేంజ్ అధికారి నర్సింగరావు తెలిపారు.
కోనసీమ: యానాం అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి మల్లాడి కృష్ణారావు తెలిపారు. గృహ నిర్మాణ పథకాలు, ఆరోగ్య బీమా, ఓఎన్జీసీ పరిహారం, మత్స్యకారుల సమస్యలు, ఇళ్ల పట్టాల పంపిణీ, మినీ హార్బర్ పనులపై మంగళవారం సమీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరస్తామన్నారు.
AP: ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. కూటమి నేతలు సూపర్-6ను సూపర్ సున్నా చేశారని ఎద్దేవా చేశారు. మహాలక్ష్మి, నిరుద్యోగ భృతి పథకాలు ఏమయ్యాయో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కూటమి దొడ్డిదారిన గెలవడానికే SIR ప్రక్రియ అని, YCP నాయకత్వం అప్రమత్తంగా ఉండాలని గుడివాడలో నిర్వహించిన SIR అవగాహన సదస్సులో సూచించారు.
E.G: తాడితోట మోడల్ కెరీర్ సెంటర్లో జూన్ 6న ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి సి.హెచ్. శిరీష తెలిపారు. మిరకల్ సాఫ్ట్వేర్, ఠాగూర్ సంస్థల్లోని ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని 10 నుంచి పీజీ వరకు అర్హతలు కలిగిన 19–40 ఏళ్ల అభ్యర్థులు పాల్గొనవచ్చు. ఆసక్తి గల వారు employment.ap.gov.inలో నమోదు చేసుకోవాలన్నారు.