• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

గుంటూరు GGHలో సర్వర్ డౌన్.. ప్రజలకు ఇక్కట్లు

గుంటూరు GGHలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 15 రోజులుగా సర్టిఫికెట్ల కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని బాధితులు వాపోతున్నారు. సాంకేతిక కారణాల వల్ల మూడు రోజులుగా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సర్వర్ పని చేయడం లేదని, అందుకే పత్రాలు అందించలేకపోతున్నామని సిబ్బంది చెబుతున్నారు.

March 13, 2026 / 02:00 PM IST

ఏప్రిల్ 1న ‘ఆర్టెమిస్ II మిషన్’ లాంచ్

నాసా తన ప్రతిష్టాత్మక ‘ఆర్టెమిస్ II మిషన్’ను ఏప్రిల్ 1న ప్రయోగించనుంది. ఇందులో భాగంగా నలుగురు వ్యోమగాములు ఓరియన్ క్యాప్సూల్‌లో చంద్రుని చుట్టూ 10 రోజులు ప్రదక్షిణ చేసి తిరిగి భూమికి చేరుకుంటారు. ఒకవేళ 1న లాంచ్ సాధ్యం కాకుంటే, ప్రత్యామ్నాయంగా 2-6 తేదీల్లో 4 ప్రత్యామ్నాయ ముహుర్తాలను నాసా సిద్ధం చేసింది. ఈ మిషన్ అంతరిక్ష పరిశోధనల్లో సరికొత్త అధ్యాయంగా నిలవనుంది.

March 13, 2026 / 01:50 PM IST

ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించిన సర్పంచ్.

WGL: నల్లబెల్లి(M) కేంద్రానికి సమీపంలోని రంగాపురం గ్రామంలో పరిశుభ్రత పెంపొందించే లక్ష్యంగా శుక్రవారం ‘ఫ్రైడే డ్రై డే’ కార్యక్రమాన్ని సర్పంచ్ ఓరుగంటు మాధురి రాజు నిర్వహించారు. గ్రామంలోని నీరు నిల్వ ఉండే ప్రదేశాలు, చెత్త పేరుకుపోయిన ప్రాంతాలను పరిశీలించి సిబ్బందితో శుభ్రపరిచారు. గ్రామ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు.

March 13, 2026 / 01:45 PM IST

‘ఉస్తాద్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌పై నిర్మాత UPDATE

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మార్చి 19న విడుదల కానుంది. తాజాగా విడుదలైన ‘కాలరే ఎత్తారా’ సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ పాట లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. మార్చి 15న హైదరాబాద్‌లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో గ్రాండ్‌గా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌లో జోష్ నింపాడు.

March 13, 2026 / 01:44 PM IST

‘ధురందర్‌ 2’ టికెట్‌ రేటు రూ. 3100..!

భారీ అంచనాల నడుమ వస్తున్న ‘ధురంధర్-2’ టికెట్ ధరల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఢిల్లీలోని ఐనాక్స్ మెగాప్లెక్స్‌లో ఒక ప్రత్యేక స్క్రీన్ కోసం టికెట్ ధరను రూ.3,100గా నిర్ణయించారు. బుక్ మై షో ఛార్జీలతో కలిపి ఇది రూ.3,145కి చేరుతుంది. కేవలం 42 సీట్లు ఉన్న ఈ స్క్రీన్‌లో ప్రీమియర్స్ కోసం ఈ ధర ఫిక్స్ చేశారు. బెంగళూరులో కొన్ని స్క్రీన్లలో రేట్లు రూ.800 వరకు ఉన్నాయి.

March 13, 2026 / 01:42 PM IST

జాళ్లపాలెం తిరునాళ్లపై పోలీసుల నిఘా

ప్రకాశం: కొండపి మండలం జాళ్లపాలెం గ్రామంలో నిర్వహించనున్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి తిరునాళ్ల సందర్భంగా పోలీసులు ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. కొండపి ఎస్సై, దేవస్థాన ఈవో కలిసి ఉత్సవ ప్రాంగణాన్ని పరిశీలించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్, పార్కింగ్ ఏర్పాట్లపై సూచనలు చేశారు. తిరునాళ్ల సమయంలో శాంతిభద్రతలు కట్టుదిట్టంగా ఉండాలన్నారు.

March 13, 2026 / 01:40 PM IST

కలెక్టర్ కార్యాలయం ముందు సీఐటీయూ ధర్నా

SRD: కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సంగారెడ్డి జిల్లాకలెక్టర్ కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ కార్మికులకు నెలకు రూ. 26 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

March 13, 2026 / 01:40 PM IST

‘అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం’

KMM: రాష్ట్రంలో ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. శుక్రవారం తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. 3 సంవత్సరాలలో పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు.

March 13, 2026 / 01:38 PM IST

‘కవియిత్రి మొల్లమాంబ సేవలు మరువలేనివి’

SRCL: కవియిత్రి మొల్లమాంబ సేవలు మరువలేనివని కుమ్మర యువజన సంఘం అధ్యక్షుడు ఐలపురం హరీష్ అన్నారు. ముస్తాబాద్‌లో మొల్లమాంబ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ.. కవిత్వంలో కవియిత్రి మొల్ల మాంబా చేసిన సేవలు ఎన్నడు మరువలేనివని కొనియాడారు. ఉపాధ్యక్షుడు ఎదునూరి సతీష్,సలహాదారులు భానుచందర్, సంతోష్, అశోక్ ఉన్నారు.

March 13, 2026 / 01:38 PM IST

పనిముట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే నాగరాజు

WGL: వర్ధన్నపేట, పర్వతగిరి, వరంగల్ మండలాలకు చెందిన 27 మంది లబ్ధిదారులకు 50 శాతం సబ్సిడీపై పనిముట్లను ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పంపిణీ చేశారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ యంత్రికరణకు ప్రాధాన్యత ఇస్తున్నాయని, రైతులు పంటల సాగులో మెలకువలు పాటించి అధిక దిగుబడులు పొందాలని ఎమ్మెల్యే అన్నారు.

March 13, 2026 / 01:37 PM IST

అలాంటి రూల్ లేదు కదా!: సన్‌రైజర్స్

‘ది హండ్రెడ్’ లీగ్ కోసం అబ్రార్‌ను తీసుకోవడంతో వస్తున్న విమర్శలపై ‘సన్‌రైజర్స్ లీడ్స్’ కోచ్ డానియెల్ వెటోరీ స్పందించాడు. యూనిక్ బౌలింగ్ వేరియేషన్స్ కలిగిన అబ్రార్‌తో పాటు ఉస్మాన్ తారిక్ వేలానికి ముందే తాము తీసుకోవాలనుకున్న ప్లేయర్ల లిస్టులో ఉన్నాడని.. పాక్ ప్లేయర్లను తీసుకోకూడదనే రూల్ ఏం లేదు కదా అని పేర్కొన్నాడు. దీంతో SRH అభిమానులూ మండిపడుతున్నారు.

March 13, 2026 / 01:36 PM IST

తిరుపతి అభివృద్ధికి బలమైన పునాది వేశాం: మేయర్

తిరుపతి కార్పొరేషన్ పాలకమండలి పదవీ కాలం ఈనెల 16వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో మేయర్ డాక్టర్ శిరీష ఆధ్వర్యంలో చివరి సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భగా ఆమె మాట్లాడుతూ.. ‘తిరుపతికి తొలి మేయర్‌గా పనిచేయడం నాకు లభించిన అరుదైన గౌరవం. ఐదేళ్ల పాలనలో తిరుపతి అభిృద్ధికి బలమైన పునాది వేశా. అందుకు సహకరించిన నగర ప్రజలు, కార్పొరేటర్లు, అధికారులకు కృతజ్ఞతలు’ అని అన్నారు.

March 13, 2026 / 01:35 PM IST

దేవాలయ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

SRD: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధి చిట్కుల్ గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం వార్షికోత్సవంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన దేవాలయాల నిర్మాణాలకు సహకారం అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, స్థానిక నాయకులు, కౌన్సిలర్లు, గ్రామ పెద్దలు ఉన్నారు.

March 13, 2026 / 01:34 PM IST

‘పేద ప్రజలకు వరం కల్యాణ లక్ష్మి పథకం’

JGL: పేద ప్రజలకు వరం కల్యాణ లక్ష్మీ పథకం అని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్, అర్బన్ మండలాలకు చెందిన 10 మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకం కింద మంజూరైన రూ. 10 లక్షలు విలువ చేసే చెక్కులను శుక్రవారం ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నందయ్య, మున్సిపల్ ఛైర్ పర్సన్ వాణి, తహసీల్దార్ రామ్మోహన్, నాయకులు పాల్గొన్నారు.

March 13, 2026 / 01:34 PM IST

లాల్ టెక్డి గురుకులంలో ఇంటర్ పరీక్షల తనిఖీ

ADB: ఉట్నూర్ మండలం లాల్ టెక్డిలోని ప్రభుత్వ గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని DIEO గణేష్ శుక్రవారం తనిఖీ చేశారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గదుల్లో వసతులు కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించి పలు సూచనలు చేశారు.

March 13, 2026 / 01:31 PM IST