• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

CSK vs GT: సాయి సుదర్శన్ 14వ హాఫ్ సెంచరీ

గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ సాయి సుదర్శన్ IPLలో తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. RCBతో జరిగిన గత మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన అతడు, ఇప్పుడు CSKతో జరుగుతున్న పోరులోనూ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. కేవలం 33 బంతుల్లోనే IPLలో తన 14వ అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో గుజరాత్ విజయం దిశగా దూసుకుపోతోంది. ప్రస్తుతం 13 ఓవర్లలో స్కోర్ 118/1.

April 26, 2026 / 06:52 PM IST

పెట్రోల్, డీజిల్ కొరత అపోహ మాత్రమే: జేసీ

PLD: ఇంధన కొరతపై వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని జాయింట్ కలెక్టర్ సంజన సింహ స్పష్టం చేశారు. ఆయిల్ కంపెనీలతో సమన్వయం చేసుకుంటూ నిల్వలు తగ్గిన బంకులకు వెంటనే సరఫరా పునరుద్ధరిస్తున్నామని తెలిపారు. రైతుల కోసం 10% అదనపు డీజిల్ అందుబాటులో ఉంచామన్నారు. సోషల్ మీడియా వార్తలను నమ్మి అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేసి ఆందోళన చెందవద్దని సూచించారు.

April 26, 2026 / 06:50 PM IST

ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

RR: చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని దామరగిద్ద గ్రామంలో మల్లన్న స్వామి దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమంలో మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించారు. స్వామి వారి ఆశీస్సులు అందరీపై ఉండి అందరు సంతోషంగా ఉండాలని కోరుకున్నారు.

April 26, 2026 / 06:49 PM IST

బైక్- కారు ఢీ.. యువకుడికి తీవ్ర గాయాలు

NZB: బోధన్ పట్టణంలోని ఆచన్ పల్లి పెట్రోల్ పంపు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కారు- బైక్ ఢీకొన్న ఘటనలో రెంజల్ మండలానికి చెందిన యువకుడు గాయపడ్డాడు. వెంటనే అతడిని 108 అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు. సకాలంలో స్పందించిన 108 సిబ్బంది ఈఎంటీ లక్ష్మణ్, పైలట్ అనిల్‌ను పలువురు అభినందించారు.

April 26, 2026 / 06:49 PM IST

పెట్రోల్ బంకులపై ఆకస్మిక తనిఖీలు

TPT: తిరుపతి పట్టణంలోని పలు పెట్రోల్ బంకులపై జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇంధన నాణ్యత, కొలతలు, నిర్వహణపై పరిశీలించి, పారదర్శకంగా సేవలు అందించాలని నిర్వాహకులకు ఆదేశించారు. వినియోగదారుల ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

April 26, 2026 / 06:48 PM IST

రేపు జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 10:30 నుంచి 1:00 వరకు నిర్వహించడం జరుగుతుందని ప్రజలు తమ సమస్యలను నేరుగా ప్రజావాణికి వచ్చి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈఅవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

April 26, 2026 / 06:47 PM IST

ఘనంగా అన్నమయ్య సంకీర్తనల పోటీలు.!

KDP: నగరంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో శ్రీ కోదండ రామాలయంలో రేపు నెల 2 తేదీన తెలుగు పద కవితా పితామహుడు, ప్రముఖ వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్యులు జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 30వ తేదీన ఉదయం 9:30 గంటలకు ఆలయంలో అన్నమయ్య సంకీర్తనల పోటీలు నిర్వహిస్తారని, 2వ తేదీన సప్తగిరి సంకీర్తనల గోష్టి గానం ఉంటుందన్నారు.

April 26, 2026 / 06:46 PM IST

తోపనపల్లి వాసి గిన్నిస్ రికార్డ్

WGL: నెక్కొండ మండలం తోపనపల్లి గ్రామానికి చెందిన గడ్డల రాజు అరుదైన ఘనత సాధించారు. HYDలోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఓ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘లార్జెస్ట్ కరాటే డిస్‌ప్లే’ విభాగంలో ఆయన గిన్నిస్ వరల్డ్ రికార్డును నెలకొల్పారు. ఈ మేరకు గ్రాండ్ మాస్టర్ జయంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయన ప్రపంచ రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు.

April 26, 2026 / 06:46 PM IST

లబ్ధిదారులకు కారును అందజేసిన మంత్రి

ప్రకాశం: పీఎం ఈజీపీ స్కీంలో మంజూరైన కారును ఇవాళ మంత్రి స్వామి టంగుటూరు (M) నాయుడుపాలెం తన క్యాంపు కార్యాలయంలో మరిపూడి మండలం చిలంకూరు గ్రామానికి చెందిన లబ్ధిదారులు మేళం అనితకు అందజేశారు. కారు విలువ 10 లక్షలు ఉండగా, సబ్సిడీ 3,50,000 వస్తుందన్నారు. ఇందుకు లబ్ధిదారుల కుటుంబ సభ్యులు మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

April 26, 2026 / 06:45 PM IST

వైభవంగా వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలు

KRNL: ఆదోని పట్టణంలోని ఫారెస్ట్ లైన్ ప్రాంతంలో వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన ఉత్సవాలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఆలయ నిర్వహకురాలు మీనాక్షి భాయి ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, భజనలు జరిగాయి. భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

April 26, 2026 / 06:45 PM IST

ఘనంగా బ్రహ్మంగారి ఆరాధన ఉత్సవాలు

NDL: బనగానపల్లె పట్టణంలోని నేలమట్టం వద్ద ఇవాళ బ్రహ్మం గారి 333వ ఆరాధన ఉత్సవాలను భక్తులు అత్యంత వైభవంగా నిర్వహించారు. రవ్వల కొండపైన బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసి ప్రపంచానికి తెలియజేశారని భక్తులు కొనియాడుతూ ఉంటారు. బ్రహ్మంగారి నేలమటంలో ఉదయం నుంచి స్వామివారికి అనేక పూజలను చేశారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

April 26, 2026 / 06:45 PM IST

నంది విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్మన్

MNCL: బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామపంచాయతీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం నంది విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. మసాడి పద్మ-గోపాల్ విగ్రహ దానం చేశారు. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ దావ స్వాతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలో ఛైర్మన్ దంపతులు పాల్గొన్నారు.

April 26, 2026 / 06:44 PM IST

మేడేను జయప్రదం చేయాలని కార్మిక సంఘాల పిలుపు

సూర్యాపేటలో BRTU ఆధ్వర్యంలో జరిగిన సన్నాహక సమావేశంలో మేడే వేడుకలను జయప్రదం చేయాలని ఈరోజు పిలుపునిచ్చారు. 8 గంటల పని కాలాన్ని 12 గంటలకు పెంచే కేంద్ర చట్టాలను నాయకులు నిరసించారు. హమాలీలు, అంగన్‌వాడీలు, మున్సిపల్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. మేడే ఉదయం 8 గంటలకు జెండా ఆవిష్కరణ ఉంటుందని నాయకులు వెల్లడించారు.

April 26, 2026 / 06:44 PM IST

బస్టాండ్‌లో అగ్నిప్రమాదం.. ప్రయాణికులు పరుగులు

AP: విజయవాడ బస్టాండ్ మొదటి అంతస్తులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎగ్జాస్ట్ ఫ్యాన్ల సమీపంలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు బయటకు పరుగులు తీశారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో మొదటి అంతస్తులో ఉంచిన పాత ఫర్నిచర్, పాత కంప్యూటర్లు, దస్త్రాలు దగ్ధమయ్యాయి. 

April 26, 2026 / 06:42 PM IST

అగ్ని ప్రమాదం.. ఎనిమిది ఎకరాల గడ్డివాము దగ్ధం

WGL: మంటలు అంటుకుని ఎనిమిది ఎకరాల గడ్డివాము పూర్తిగా దగ్ధమైన ఘటన పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఉద్దేశపూర్వకంగానే గుర్తు తెలియని వ్యక్తులు గడ్డివామును తగలబెట్టారని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. భారీ నష్టం వాటిల్లిందని, వారికి న్యాయం చేయాలని స్థానికులు కోరారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 26, 2026 / 06:41 PM IST