TG: ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ హెచ్ జే దొర మృతి చెందారు. హైదరాబాద్ ఇంట్లోని బాత్ రూమ్లో జారీ పడ్డారు. దీంతో అతణ్ని కుటుంబసభ్యులు నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా, అతను కొన్ని రోజులగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు.
BHPL: మహిళలు ఆర్థికంగా స్వశక్తిని సాధించేలా రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం మహదేవపూర్ సబ్-డివిజన్ పరిధిలోని 850 మంది మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. శిక్షణ పూర్తయ్యాక స్థానికంగా గార్మెంట్ పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
BHPL: జిల్లాలో ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు SP సంకీర్త్ తెలిపారు. SP మాట్లాడుతూ.. 21 పరీక్షా కేంద్రాల వద్ద BNSS సెక్షన్ 163 (144 సెక్షన్) నిషేధాజ్ఞలు అమలు చేసినట్లు SP వెల్లడించారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఎస్పీ కోరారు.
TPT: ఏర్పేడు వద్ద ఉన్న IISER తిరుపతిలో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు ఈ నెల 16న వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. మొత్తం 2 ఖాళీలు ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. బ్యాచిలర్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్స్, B.VSc, బీఫార్మసీ లేదా నేచురల్ సైన్స్లో డిగ్రీ చేసిన వారు అర్హులు. వివరాలకు www.iisertirupati.ac.in/jobsలో చూడవచ్చు.
AP: పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్ట గెజిట్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్లో పోలవరం, మార్కాపురం జిల్లాలు చేర్చే ప్రతిపాదనలను కేంద్రానికి పంపే అజెండాకు అమోదం లభించింది. పోలవరం ప్రాజెక్ట్ హెడ్ వర్క్స్లో అదనపు గ్రానైట్ కొనుగోలు, లైనింగ్ పనులకు రూ.23.47 కోట్లు కేటాయించారు. పోలవరం ప్యాకేజ్-64 పనులకు రూ.24.51 కోట్లు మంజూరుకు అనుమతి ఇచ్చింది.
MNCL: గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులు భాగస్వాములు కావాలని దండేపల్లి మండల పంచాయతీ అధికారి ప్రసాద్ సూచించారు. దండేపల్లిలోని రైతు వేదికలో వార్డు సభ్యులకు నిర్వహిస్తున్న మొదటి దశ శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా వార్డు సభ్యులకు పంచాయతీ రాజ్ చట్టం, గ్రామ పరిపాలన, విధులు, నిధులు, గ్రామ సభ తీర్మానాలు, తదితర వాటిపై అవగాహన కల్పించారు.
E.G: గృహ అవసరాలు, అత్యవసర సేవలకు నిరంతరాయంగా LPG సరఫరా జరిగేలా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలైన IOCL, HPCL, BPCL సంస్థలతో నిరంతరం పర్యవేక్షణ కొనసాగతుందని జిల్లా పౌర సరఫరాల అధికారి వి.పార్వతి శుక్రవారం తెలిపారు. జిల్లాలో ఉన్న 52 LPG గ్యాస్ పంపిణీదారుల ద్వారా సుమారు 8.67 లక్షల గ్యాస్ కనెక్షన్ దారులకు గ్యాస్ సరఫరా జరుగుతోందన్నారు.
VZM: కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతిని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు ఎస్పీ పి.సౌమ్యలత ముఖ్య అతిథిగా హాజరై, కవయిత్రి చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సంస్కృత భాషలోని రామాయణాన్ని ప్రప్రథమంగా తెలుగులోకి అనువదించిన మహిళగా మొల్లమాంబ ఘనత సాధించారన్నారు.
KNR: హుజూరాబాద్ పట్టణంలో ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది. మున్సిపల్ ఛైర్ పర్సన్ రొంటాల సుహాసిని, కమిషనర్ సయ్యద్ ముసబ్ అహ్మద్ ఆధ్వర్యంలో శుక్రవారం నీటి ట్యాంకుల శుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం పలు వార్డుల్లో పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
NDL: ఆళ్లగడ్డలోని సుంకులమ్మ వీధిలో సబ్ యూనిట్ అధికారి శివ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఫ్రైడే – డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. నిల్వ నీటి గచ్చులను పరిశీలించి దోమల లార్వా నిర్మూలన చర్యలు చేపట్టాలని అయన సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. దోమల ద్వారా వ్యాపించే వ్యాధులపై కరపత్రాలు పంపిణీ చేశారు.
JN: నర్మెట్ట మండలంలో ఇటీవల నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు ఈనెల 9వ తేదీ నుంచి నేటి వరకు శిక్షణ శిబిరాలను నిర్వహించారు. శిక్షణ పూర్తి చేసుకున్న వార్డు సభ్యులకు నేడు అధికారులు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. గ్రామాల సమగ్ర అభివృద్ధిలో వార్డు మెంబర్లు భాగస్వాములు కావాలని, అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులు సూచించారు.
ADB: అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని కోరుతూ యూనియన్ అధ్యక్షురాలు సునీత ఆధ్వర్యంలో శుక్రవారం ఎమ్మెల్యే పాయల్ శంకర్కు వినతిపత్రం అందజేశారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వేతనాల పెంపుతో పాటు బడ్జెట్లో ఐసీడీఎస్కు నిధులు పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
SKLM: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలుగు సాహిత్యంలోని తొలి ప్రముఖ మహిళా కవయిత్రిగా గుర్తింపు పొందిన మొల్లమాంబ జయంతిని శుక్రవారం అధికారులు నిర్వహించారు. బీసీ కార్పొరేషన్ అధికారి అనురాధ ముఖ్యఅతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేశారు. మొల్ల రామాయణం తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం సంపాదించిందని ఆమె అన్నారు.
TG: తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. కాసేపట్లో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మె నోటీసు ఇవ్వనున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో బస్ భవన్కు పోలీసులు, కార్మిక సంఘాల నేతలు భారీగా చేరుకున్నారు.
AP: 300 మంది హెడ్ కానిస్టేబుల్ పోస్టులను రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులుగా అప్గ్రేడ్ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. చిన్న పరిశ్రమలకు ఊతమిస్తూ దాదాపు 17 వేలమందికి ఉపాధి లభించేలా చర్యలు తీసుకుంది. FRA పట్టాదారులకు రాయితీలు కల్పించే ప్రతిపాదనలకు ఆమోదం చెప్పింది. విశాఖ, విజయవాడ, తిరుపతి అప్పీల్ కార్యాలయాల పరిధిపై నిర్ణయం తీసుకుంది.