AP: తాడేపల్లిలోని YCP కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ అధ్యక్షతన బుధవారం PAC సమావేశం జరగనుంది. దీనిలో పార్టీ వ్యవహాలతో పాటు రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలపై చర్చించనున్నారు. మెగా డీఎస్సీలో అవినీతి జరిగిందంటూ ఆరోపిస్తున్న YCP నాయకులు ఆ అంశంపై ఈ మీటింగ్లో ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉంది.