TG: ఎండలతో అల్లాడుతున్న జనానికి వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు త్వరలోనే కేరళను తాకనుండగా, ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో మూడు రోజులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు కూడా జారీ చేసింది. రాబోయే నాలుగు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు తగ్గుతాయని పేర్కొంది.