టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబై జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. అరంగేట్రం మ్యాచ్లోనే యువ ఆటగాడు డానిష్ మాలేవార్ కేవలం 2 పరుగులకే ఔటయ్యాడు. మరో ఓపెనర్ డికాక్ కూడా 13 పరుగులు చేసి పెవిలియన్కు చేరాడు. వీరిద్దరినీ రబడా తన వరుస ఓవర్లలో ఔట్ చేశాడు. దీంతో ముంబై 25 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం నమన్ ధీర్, సూర్యకుమార్ క్రీజులో ఉన్నారు.
ELR: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు పోటీతత్వంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ ప్రోగ్రాంలో పాల్గొని మాట్లాడారు. ప్రతి అర్జీని చాలెంజీగా తీసుకుని నిర్ణీత సమయంలో శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. అలాగే ఈరోజు జరిగిన పీజీఆర్ఎస్, రెవిన్యూ క్లినిక్లలో 257 అర్జీలు స్వీకరించడం జరిగిందన్నారు.
PLD: చిలకలూరిపేటలోని NRT సెంటర్ సమీపంలో గల సరళ నర్సింగ్ హోమ్ వీధిలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార కేంద్రంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న ముందస్తు సమాచారంతో, సోమవారం సాయంత్రం అర్బన్ సీఐ రమేష్ తన సిబ్బందితో కలిసి ఓ ఇంటిపై దాడి నిర్వహించి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
TG: మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీ పర్యటన వివరాలు బయటపెట్టాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. ఢిల్లీలో హరీష్ ఎవరెవరిని కలిశారో విచారణ జరిపిస్తామని తెలిపారు. RSS పెద్దలను కలిసి లాబీయింగ్కు ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. అన్ని వివరాలు బయటపెడతామని స్పష్టం చేశారు.
తూ.గో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి ప్రభుత్వ బాలుర పర్యవేక్షణ గృహాన్ని సోమవారం సందర్శించి అక్కడి వసతులను పరిశీలించారు. పర్యవేక్షణ గృహంలో ఉన్న బాలురతో మాట్లాడి వారి బాగోగులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాలురకు ఆమె పలు సూచనలు చేశారు. వ్యసనాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండాలని, విద్యపై దృష్టి సారించాలన్నారు.
ATP: పామురాయి సమీపంలో జరిగిన మైనర్ బాలుడి హత్య కేసును అనంతపురం రూరల్ పోలీసులు 48 గంటల్లో ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. రజక కాలనీకి చెందిన కళ్యాణ్ సాత్విక్ అనే బాలుడిని, రామమోహన్ సిమెంట్ పెల్లలతో తలపై కొట్టి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. తన భార్యతో బాలుడు సన్నిహితంగా ఉన్నాడనే అనుమానంతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
W.G: జిల్లా కలెక్టర్ నాగరాణిని భీమవరం కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నూతనంగా విధుల్లో జాయిన్ అయిన జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారి బి.సుబ్బారావు మర్యాదపూర్వకంగా కలిశారు. అక్రమ మద్యం రవాణా అరికట్టడానికి కృషి చేయాలని, మద్యం షాపులు నిర్వహణను నిబంధనల మేరకు నిర్వహించేలా చూడాలని ఆదేశించారు.
KRNL: ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల్లో అన్ని వసతులు ఉన్నాయని, విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ చేసుకోవాలని UTF జిల్లా అధ్యక్షులు రవికుమార్, KDCC దానమయ్య ఛైర్మన్ పేర్కొన్నారు. ఇవాళ గూడూరు పట్టణంలో ‘ప్రభుత్వ బడులను బలోపేతం చేద్దాం’ కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాల్లో చేర్పించాలన్నారు.
TG: కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమైన ప్రాజెక్టు అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. అందులో ఒకటి మేడిగడ్డ అని.. ఆ ప్రాజెక్టుకు రూ. 4వేల కోట్లు ఖర్చు అయ్యాయని తెలిపారు. కుంగిన రెండు పిల్లర్ల మరమ్మతులకు రూ.400 కోట్లు అవసరం అవుతాయని పేర్కొన్నారు. మేడిగడ్డను మరమ్మతులు చేయకుండా.. రేవంత్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారన్నారు. కరవు వస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
NZB: వేల్పూర్ మండలంలోని మోతేలో 12 అడుగుల ఎత్తైన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు అవసరమైన రూ.2.25 లక్షల వ్యయాన్ని దాత అల్లపుల్ల గంగారెడ్డి సమకూర్చారు. సోమవారం విగ్రహ తయారీదారు శిల్పి శ్రీనివాస్కు అడ్వాన్స్ చెక్కును అందజేసి పనులను ప్రారంభించారు. యువతకు శివాజీ ఆశయాలు స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా గ్రామస్థులు కొనియాడారు.
GNTR: దివ్యాంగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించిన గుంటూరు జిల్లా కలెక్టర్ సీ.యం. సాయి కాంత్ వర్మ ట్రైసైకిళ్లు, వీల్చైర్లు, వినికిడి ఉపకరణాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. దివ్యాంగుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలు విడుదల అయ్యాయి. NTA వెబ్ సైట్లో ఫలితాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ నెల 2 నుంచి 8 వరకు జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 11.23 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
W.G: భీమవరంలోని ఓ ప్రైవేటు కళాశాల ఆడిటోరియంలో సోమవారం అగ్నిమాపక వారోత్సవాలు ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నాగరాణి పాల్గొన్నారు. ఇటీవల తమిళనాడులో జరిగిన అగ్ని ప్రమాదంలో 22 మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనను ప్రస్తావిస్తూ, ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు, ప్రజలకు సూచించారు.
ELR: తడికలపూడి గ్రామంలో ప్రజలకు పోలీసులు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై వల్లి పద్మ మాట్లాడుతూ.. సైబర్ నేరాలకు గురికాకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారి ఫోన్లోకి వచ్చే ఓటిపిలను ఎవరితోను షేర్ చేయవద్దన్నారు. సమాజంలో మహిళలు, చిన్నారులపై జరిగే అఘాయిత్యాలను అరికట్టడంలో ప్రజలు సహకరించాలని కోరారు.
ADB: సారంగాపూర్ మండలం స్వర్ణ ఆశ్రమ పాఠశాలను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని వసతి గృహాన్ని సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. భోజనానికి ఉపయోగించే ఆహార పదార్థాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. విద్యార్థులకు చదువుతోపాటు నాణ్యమైన భోజనాన్ని అందించాలని సిబ్బందిని ఆదేశించారు.