SRPT: వేసవి సెలవుల్లోనూ అనంతగిరి మండల పరిధిలోని శాంతినగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పురుషోత్తం పాఠశాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. స్వయంగా పాఠశాల డాబాపై నిల్వ ఉన్న మురికి నీటిని తొలగించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. పాఠశాల ప్రాంగణం పరిశుభ్రత, మొక్కల సంరక్షణ కోసం నిత్యం శ్రమిస్తున్నారు.