KRNL: ఓర్వకల్లు (మ) చింతలపల్లిలో ఏర్పాటు చేస్తున్న డ్రోన్ సిటీ పనులను మంగళవారం జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పరిశీలించారు. భూసేకరణ, రోడ్లు, విద్యుత్, నీటి సరఫరా పనుల పురోగతిపై సమీక్షించారు. డ్రోన్ తయారీ, టెస్టింగ్, పరిశోధనలకు అవసరమైన మౌలిక వసతులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భూ సమస్యలు తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలన్నారు.