KDP: టిష్యూ కల్చర్ సాంకేతికత వ్యవసాయ రంగంలో కీలక పాత్ర పోషిస్తుందని ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పైడిపాలెం గ్రామంలో టిష్యూ కల్చర్ ల్యాబ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టిష్యూ కల్చర్ సాంకేతికత ద్వారా రైతులకు నాణ్యమైన, తెగుళ్లు లేని మొక్కలను అందించడం సాధ్యమవుతుందని తెలిపారు.
వేసవిలో బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎండ వేడి నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. ముఖ్యంగా గొడుగు, టోపీ లేదా ముఖానికి కాటన్ రుమాలు చుట్టుకోవడం వల్ల సూర్యరశ్మి నేరుగా చర్మంపై పడకుండా ఉంటుంది. కళ్ల రక్షణ కోసం నాణ్యమైన సన్ గ్లాసెస్ వాడాలి. ఈ చిన్నపాటి రక్షణ కవచాలు వడదెబ్బ తగలకుండా కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి.
KNR: విద్యుత్ షాక్తో మృతి చెందిన శంకరపట్నం మండలం వంకాయగూడెం గ్రామానికి చెందిన మూల రాకేష్ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. బాధిత కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల ఎక్స్రేషియా చెక్కును విద్యుత్ శాఖ AD కె.శ్రీనివాస్ అందజేశారు. ప్రభుత్వం కల్పించిన ఈ ఆర్థిక సాయం ఆ కుటుంబానికి కొంత ఉపశమనం కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ప్రకాశం: తర్లుపాడు సబ్ స్టేషన్, తుమ్మల చెరువు సబ్ స్టేషన్, మేకలవారిపల్లి సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తునట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. మరమ్మత్తుల కారణంగా శనివారం ఉదయం 6:30 గంటల నుంచి 10:30 వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందన్నారు. ఈ అంతరాయానికి ప్రజలు సహకరించాలని కోరారు.
VKB: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ చౌక ధరల దుకాణాలను కలెక్టర్ పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్ చూడడంతోపాటు ప్రజలకు అందిస్తున్న చౌక ధర సరుకులను అడిగి తెలుసుకున్నారు. డీలర్లు ఎలా పనిచేస్తున్నారని RDO వాసు, తహసీల్దార్ లక్ష్మీనారాయణ నుంచి వివరాలు సేకరించారు. కార్యక్రమంలో డీలర్ గోపాల్, కౌన్సిలర్ రాఘవేందర్ పాల్గొన్నారు.
MBNR: పదో తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ డి. జానకి తెలిపారు. పరీక్ష సమయాల్లో (ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు) కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో 163 BNSS యాక్ట్ ప్రకారం ఐదుగురికి మించి గుంపులుగా ఉండకూడదని ఆదేశించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలన్నారు.
NTR: ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా తిరువూరు నగర పంచాయతీ కార్యాలయంలో మున్సిపల్ వర్కర్లకు అవగాహన సదస్సు శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రవి శంకర్, అపోలో డయాలసిస్ డాక్టర్ రాజీవ్, సెంటర్ మేనేజర్ భరత్ పాల్గొన్నారు. కిడ్నీ ఉపయోగాలు, కిడ్నీ జబ్బులు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు.
GNTR: గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే తెలిపారు.
KMM: కామేపల్లి మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే కోరం కనకయ్య శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పలు గ్రామాలలో నిర్మించనున్న బీటీ రోడ్డుకు మంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే అసంతృప్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రజా ప్రభుత్వం పూర్తి చేసి లబ్ధిదారులతో కలిసి సామూహిక గృహప్రవేశంలో పాల్గొన్నారు.
VSP: ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోని అన్ని న్యాయ స్థానాలలో మార్చి 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. లోక్ అదాలత్లో న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న సివిల్, చెక్ బౌన్స్, బ్యాంకింగ్, మోటార్ ప్రమాదాల నష్ట పరిహారాలు పరిష్కరించుకోవచ్చన్నారు.
E.G: ద్వారకా తిరుమల మండలం సి.హెచ్. పోతేపల్లికి చెందిన బక్క తరుణ్ విష్ణు కుమార్ నిరుపేద ఇంజనీరింగ్ విద్యార్థి జీవితం ఎంతో విషాదకరంగా మారింది. చిన్న వయసులోనే తండ్రిని, తల్లిని కోల్పోయాడు. అనాధ బాలుడు చదువు కొనసాగించడం చాలా కష్టంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు శుక్రవారం సొంత నిధులతో ఆర్థిక సహాయంతో ల్యాప్టాప్ అందజేశారు.
JGL: తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలను ఇబ్రహీంపట్నం మండల కేంద్రంతో పాటు అమ్మక్కపేట, తిమ్మాపూర్, గోదూర్ గ్రామాల్లో శాలివాహన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గోదూర్లో విగ్రహానికి, ఇతర గ్రామాల్లో చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.
ATP: ఉరవకొండ పట్టణంలోని మసీదుల నిర్వహణకు మంత్రి పయ్యావుల కేశవ్, టీడీపీ నాయకుడు పయ్యావుల శ్రీనివాసులు ఆర్థిక సాయం అందజేశారు. ఏటా ఆనవాయితీగా మసీదుల పరిశుభ్రత, నిర్వహణ కోసం ఒక్కో మసీదుకు రూ.15 వేలు ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఏడాది కొత్తగా ఏర్పడిన మసీదుతో కలిపి మొత్తం 8 మసీదులకు రూ.1.20 లక్షలు అందజేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
GDWL: అయిజ మండలం ఏక్లాస్పురం గ్రామ పంచాయతీ కార్యదర్శి రంగన్న శుక్రవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు విషయంలో ఓ లబ్ధిదారుడి నుంచి రూ. 15,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా అధికారులు ఆకస్మిక దాడి చేసి పట్టుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ బృందం, లంచం సొమ్మును స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నారు.