PDPL: విద్యార్థుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన సూపర్ సమ్మర్ క్యాంప్ వినియోగించుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. మంథనిలో ఈనెల 25 నుంచి మే 2, RGM: మే 3 నుంచి 9, PDPL: మే 10 నుంచి 16, సుల్తానాబాద్: మే 17 నుంచి 23 వరకు కంప్యూటర్, ఏఐ, రోబోటిక్స్పై ప్రత్యేక శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. మే 26న కలెక్టరేట్లో జిల్లాస్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ గైడెన్స్ అండ్ కన్సల్టేషన్ సెంటర్ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సోమవారం పరిశీలించారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తున్న యువ పారిశ్రామికవేత్తలకు అవసరమైన అన్ని విధాల సహకారం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఇండస్ట్రియల్ గైడెన్స్ సెంటర్ ద్వారా ఒకే చోట అన్ని సేవలు అందిస్తారన్నారు.
KMR: సమస్యలపై అర్జీలు సమర్పించేందుకు ప్రజావాణి కార్యక్రమానికి తరలివచ్చే వారి కోసం సీనియర్ సిటిజన్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో పులిహోర వితరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. NZB కలెక్టరేట్లో నేడు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ చేతుల మీదుగా పులిహోర పంపిణీ చేశారు. వేసవి ఎండలు తీవ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో ప్రజావాణికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి అందజేశారు.
ప్రకాశం: ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్పీకి 57 అర్జీలు వచ్చినట్లుగా ఎస్పీ కార్యాలయం నిర్వహణ అధికారులు వెల్లడించారు. వచ్చిన అర్జీలు అన్నిటిని పరిశీలించి పరిష్కరిస్తామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెల్లడించారు.
NGKL: జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 33 వినతులను స్వీకరించారు. సమస్యలను జాప్యం లేకుండా, ప్రాధాన్యం క్రమంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు జవాబుదారీతనంతో సేవలు అందిస్తూ జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని ఆయన సూచించారు.
MDK: నిరుద్యోగ యువతకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా ‘పీఎం ఇంటర్న్షిప్’ పథకం ప్రవేశపెట్టినట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో పోస్టర్లను ఆవిష్కరించారు. 18-25 ఏళ్ల లోపు వారు అర్హులని, ఎంపికైన వారికి నెలకు రూ.5వేల వేతనంతో పాటు రూ.6వేల అదనపు సాయం అందుతుందన్నారు. ఆసక్తి గల వారు వెంటనే అధికారిక పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
కామారెడ్డి జిల్లా పీఎంపీ, ఆర్ఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా మహిళా విభాగం కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ మేరకు ఆర్ఎంఈ, పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నిజ్జన విఠల్ వివరాలు వెల్లడించారు. మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలిగా సూర సునీత, ప్రధాన కార్యదర్శిగా రాథోడ్ రుక్మిణి, గౌరవాధ్యక్షురాలిగా చామరం విమల, ఉపాధ్యక్షురాలిగా వడ్ల సుజాత ఉన్నారు.
NLG: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ కుట్రలు, కుతంత్రాలతోనే మహిళా బిల్లు ముసుగులో డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టిందని, సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి విమర్శించారు. ఈరోజు నల్లగొండ పట్టణంలో సీపీఐ జిల్లా కౌన్సిల్ సమావేశాలో ఆయన పాల్గొని మాట్లాడారు.. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే విధంగా బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందన్నారు.
జగిత్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పలు ఫిర్యాదులను పరిశీలించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 14 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. పారదర్శకంగా విచారణ జరిపి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
BPT: ఐపీఎల్ సీజన్ వేళ అక్రమంగా క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న ముఠాపై బాపట్ల జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిల్లా ఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం.. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు మొత్తం 42 మందిని అరెస్ట్ చేశారు. ఒక కారు, ఒక బైక్, 25 మొబైల్ ఫోన్లు, రూ. 51,400 నగదు స్వాధీనం చేసుకున్నట్లుగా ఎస్పీ చెప్పారు.
SDPT: కుకునూరుపల్లి మండల కేంద్రంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో కురుమ కుల ఆరాధ్య దైవమైన శ్రీ బీరప్ప స్వామి, కామరాతి కల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం కురుమ సంఘం సభ్యులు మాట్లాడుతూ.. బీరప్ప స్వామి ఆశీస్సులతో జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు.
కోనసీమ: మండపేట శాఖా గ్రంథాలయంలో విద్యార్థుల కోసం 40 రోజుల పాటు వేసవి విజ్ఞాన శిబిరం నిర్వహించనున్నట్లు గ్రంథాలయాధికారి ఎస్. పూర్ణమ్మ తెలిపారు. ఈ నెల 28వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు శిబిరం కొనసాగుతుందన్నారు. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు జరిగే ఈ శిబిరంలో పుస్తక పఠనం, స్పోకెన్ ఇంగ్లీష్, చిత్రలేఖనం వంటి వినోదాత్మక క్రీడల్లో శిక్షణ ఇవ్వనున్నారు.
RR: వివేకానంద నగర్లో PAC ఛైర్మన్ ఆరెకపూడి గాంధీ 2027 జనగణన సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది దేశంలోనే తొలి డిజిటల్ జనగణన అని, మే 10 వరకు ప్రజలు ఆన్లైన్లో స్వచ్ఛందంగా వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు. మే 11 నుంచి ఇంటింటి గణన ఉంటుందని, ప్రభుత్వ సంక్షేమ పథకాల రూపకల్పనకు ఈ గణాంకాలు కీలకమని ఆయన పేర్కొన్నారు.
MDCL: సాయిసూర్య ఎంక్లేవ్ ఫేజ్-2లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి నగరేశ్వర స్వామి దేవాలయ ప్రథమ వార్షికోత్సవాలు ఘనంగా ముగిశాయి. అభిషేకం, హవనం, మహాపూర్ణాహుతి నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదం, అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, దాతలు, భక్తులు పాల్గొన్నారు.