తెలంగాణ భూమి పుత్రుల జాగీరే.. 4 కోట్ల మంది ప్రజల జాగీర్ అని KTR కీలక వ్యాఖ్యలు చేశారు. ‘పవన్ కళ్యాణ్ను పోటీ చేయొద్దని ఎవరన్నారు.. ఎవరు అడ్డుకున్నారు. 2018, 2023లో జనసేన పోటీ చేయలేదా? తెలంగాణ వస్తే 11 రోజులు తినలేదన్నారు.. మరోసారి తెలంగాణకు వ్యతిరేకం కాదంటారు. దేశభక్తి గురించి పవన్ మాకు నేర్పించాల్సిన అవసరం లేదు’ అని పేర్కొన్నారు.