విశాఖ ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5న చిత్రలేఖన పోటీలు నిర్వహించనున్నట్లు జూ ఎడ్యుకేషన్ ఆఫీసర్ దివ్య తెలిపారు. ‘వాతావరణ చర్య’ అనే అంశంతో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జూలో ఈ కార్యక్రమం జరగనుందన్నారు. 1వ తరగతి నుంచి పీజీ విద్యార్థుల వరకు 3 విభాగాలుగా పోటీలు నిర్వహిస్తామని వెల్లడించారు.