NLG: విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని జిల్లా విద్యాశాఖాధికారి బిక్షపతి సూచించారు. డైట్ కళాశాలలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి పాఠశాలలో ‘ప్రహరీ క్లబ్’లు ఏర్పాటు చేయాలన్నారు. ఎవరైనా డ్రగ్స్ వాడుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ మానస కోరారు.
ATP: గుంతకల్లులోని గ్యాస్ గోడౌన్లను శుక్రవారం పౌర సరఫరాల డిప్యూటీ ఎమ్మార్వో సుబ్బలక్ష్మి తనిఖీ చేశారు. గోడౌన్లో ఉన్న గ్యాస్ సిలిండర్ల స్టాకును పరిశీలించారు. కలెక్టర్ సూచన మేరకు వినియోగదారులకు గ్యాస్ సరిపడా ఉండేలా చూడాలని తెలిపారు. గ్యాస్ సిలిండర్ సరఫరాల అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
MNCL: రేపటి నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంచిర్యాల డీఈఓ యాదయ్య తెలిపారు. శుక్రవారం పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 48 కేంద్రాల్లో ఉ.9.30 నుంచి 12.30 వరకు జరిగే పరీక్షలకు 4, 897 మంది బాలురు, 4,806 మంది బాలికలు హాజరుకానున్నారని పేర్కొన్నారు.
ASR: దేశానికి అన్నం పెట్టే రైతు సంతోషంగా ఉంటేనే సమాజం సుభిక్షంగా ఉంటుందని జీసీసీ ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ అన్నారు. శుక్రవారం పాడేరులో నిర్వహించిన అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకాల నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఒక్కో రైతుకు రూ.6,000 చొప్పున అల్లూరి జిల్లాలో 1,03,864 మంది రైతుల ఖాతాల్లో రూ.62.32 కోట్లు జమ అయినట్లు పేర్కొన్నారు.
AKP: అచ్యుతాపురం మండలం హరిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం 14 సంవత్సరాలు నిండిన బాలికలకు గర్భాశయ క్యాన్సర్ నివారణ కోసం హెచ్పీవీ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బాలికలు భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ ముప్పు నుంచి రక్షణ పొందేందుకు ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలని వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
BHPL: మున్సిపాలిటీ పరిధిలోని బాంబలగడ్డలో నూతన రేషన్ షాపును శుక్రవారం MLA గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా MLA గండ్ర మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు త్వరగా అందజేస్తామని హామీ ఇచ్చారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వకుండా ప్రజలను మోసం చేశారని ఎమ్మెల్యే విమర్శించారు. మున్సిపల్ ఛైర్మన్ ఉన్నారు.
BHPL: గృహ అవసరాల కోసం అందించే LPG సిలిండర్లను హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్ల వంటి వాణిజ్య కార్యకలాపాలకు వినియోగిస్తున్న వారిపై పోలీస్ కేసులు నమోదు చేస్తామని అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ హెచ్చరించారు. ఇవాళ తన కార్యాలయంలో పౌర సరఫరాల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. గృహ వినియోగ గ్యాస్ను వాణిజ్య అవసరాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధమని అన్నారు.
వనపర్తి: స్పెషల్ ఇంటెన్సీ యువర్ రివిజన్పై జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం సీ.ఓ సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వీసీలో పాల్గొన్నారు. ఎన్నికల అధికారి మాట్లాడుతూ.. మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు.
AKP: నర్సీపట్నం మండలం ధర్మసాగరంలో అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ కార్యక్రమం ఘనంగా శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ. 20,000 చొప్పున ఆర్థిక సాయం అందించే ఈ పథకం మూడవ విడత నిధుల పంపిణీని స్థానికంగా చేపట్టారు. ఈ కార్యక్రమానికి టీడీపీ పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్ చింతకాయల రాజేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
AP: మాజీ డీజీపీ HJ దొర మృతిపట్ల సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పోలీసు శాఖకు బ్రాండ్ క్రియేట్ చేయడంలో HJ దొర కీలకపాత్ర పోషించారని చెప్పారు. నక్సల్స్ సమస్య పరిష్కరించడంలో సమర్థంగా వ్యవహరించారని గుర్తుచేసుకున్నారు.
తూ.గో జిల్లా పరిధిలోని రైతులకు ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ & పీఎం కిసాన్ యోజన పథకాల కింద గణనీయమైన ఆర్థిక సహాయం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అయిందని కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం తెలిపారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా రైతుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేయడం జరిగిందన్నారు. వివిధ నియోజకవర్గాల పరిధిలో MLA, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
NDL: ఆళ్లగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. పట్టణంలోని ప్రజలు పలు సమస్యలపై ఎమ్మెల్యేకు వినతిపత్రాలు అందించారు. సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరగా పరిష్కరించాలని సూచించారు. ప్రజలు అధికారులను సంప్రదించినప్పుడు వారి సమస్యలను వేగంగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.
AKP: పాయకరావుపేట నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం కింద 39,302 మంది లబ్ధి పొందినట్లు వ్యవసాయ శాఖ ఏడీ ఉమా ప్రసాద్ తెలిపారు. శుక్రవారం కోటవురట్లలో జరిగిన కార్యక్రమంలో రైతులకు చెక్కు అందజేశారు. మూడవ విడతలో రూ.21.67 కోట్లు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసినట్లు తెలిపారు. ఇందులో టీడీపీ నాయకులు లాలం కాశీనాయుడు, కొప్పిశెట్టి వెంకటేష్ పాల్గొన్నారు.
ADB: ఇచ్చోడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఈ నెల 10న ఆదిలాబాద్లో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో ప్రతిభ కనబర్చి ఉద్యోగాలకు ఎంపిక కావడం ఆనందకరమని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తెలిపారు. కళాశాల నుండి సుమారు 15 మంది విద్యార్థులు పాల్గొన్నారని, వారిలో ముగ్గురు విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారని పేర్కొన్నారు.
W.G: అమరావతి సచివాలయంలో శుక్రవారం సీఎం చంద్రబాబుని తాడేపల్లిగూడెం నియోజకవర్గం టీడీపి ఇంఛార్జ్ వలవల బాబ్జి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి అంశాలు, భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా చేపడుతున్న కార్యక్రమాలపై చర్చించడం జరిగింది. నియోజకవర్గ అభివృద్ధి, కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అన్నారు.