BPT: ఐపీఎల్ సీజన్ వేళ అక్రమంగా క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న ముఠాపై బాపట్ల జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిల్లా ఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం.. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు మొత్తం 42 మందిని అరెస్ట్ చేశారు. ఒక కారు, ఒక బైక్, 25 మొబైల్ ఫోన్లు, రూ. 51,400 నగదు స్వాధీనం చేసుకున్నట్లుగా ఎస్పీ చెప్పారు.