MBNR: జడ్చర్ల మున్సిపాలిటీలో నూతనంగా నిర్మించిన మున్సిపల్ కార్యాలయ భవనాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి కలిసి శుక్రవారం ప్రారంభించారు. మున్సిపల్ ఛైర్ పర్సన్ కోనేటి పుష్పలత మున్సిపల్ కుర్చీలో కుర్చున్నారు. నూతన భవనంతో ప్రజలకు పాలన మరింత చేరువవుతుందని, పట్టణాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు.
PLD: ఈనెల 16న జరిగే పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఎంఈవో రవి కుమార్ అన్నారు. శుక్రవారం కారంపూడిలోని తమ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మండలం మొత్తం 654 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నట్టు తెలిపారు. విద్యార్థులు పరీక్షలు రాసేందుకు కారంపూడిలోని మూడు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
కృష్ణా: నియోజకవర్గంలో రైతులకు రూ.57.591 కోట్లు లబ్ది చేకూరినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం అవనిగడ్డ రెవిన్యూ హాలులో అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ మూడవ విడత సభ జరిగింది. రైతులతో కలిసి నియోజకవర్గంలో 30,316 మంది రైతులకు రూ.17.05 కోట్లు లబ్ది చెక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అన్నారు.
NZB: రాబోయే గోదావరి పుష్కరాలు-2027ను దృష్టిలో ఉంచుకుని NZB పరిధిలోని గోదావరి నది తీర ప్రాంతాల్లో ఉన్న ఘాట్ల వద్ద సమగ్ర ఏర్పాట్లు చేపట్టాలని ఎంపీ అర్వింద్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి శుక్రవారం లేఖ రాశారు. జిల్లాల్లో గోదావరి తీరం వెంట ఉన్న ఘాట్లకు కోట్లాది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు.
VSP: ఈనెల 16, 17వ తేదీల్లో విశాఖలో జరగనున్న ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి ప్రభుత్వ యూనివర్సిటీల కన్వెన్షన్ను విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి యూ.నాగరాజు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆంధ్ర యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద కన్వెన్షన్ పోస్టర్లను విడుదల చేశారు. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో 3,371 ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
BHPL: ప్రభుత్వ ఆదేశాల మేరకు సివిల్ సప్లై శాఖ ఎన్ఫోర్స్మెంట్ టీం BHPL పట్టణంలోని వాణిజ్య సముదాయాలు, హోటళ్లు సెంటర్ల పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 13 డొమెస్టిక్ సిలిండర్లు అక్రమంగా కమర్షియల్ వినియోగంలో ఉన్నట్లు గుర్తించారు. ఆరుగురు వ్యాపారుల పై కేసులు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో సివిల్ సప్లై ఇన్స్పెక్టర్ భాస్కర్ రాజు, సురేందర్ ఉన్నారు.
విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలోని వెలంపేటలో ఇద్దరు దివ్యాంగులకు ట్రైసైకిల్, వీల్చైర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీతంరాజు సుధాకర్ పాల్గొని లబ్ధిదారులకు వాటిని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి సేవా కార్యక్రమాలు దివ్యాంగులకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.
T20 WCలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న జింబాబ్వే ఫాస్ట్ బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీ, ఇప్పుడు IPLలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. కోల్కతా నైట్ రైడర్స్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ స్థానాన్ని ముజరబానీతో భర్తీ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారక ప్రకటన రానుంది. గతేడాది RCB జట్టులో ఉన్నప్పటికీ ముజరబానీకి తుది జట్టులో ఆడే అవకాశం దక్కలేదు.
T20 WCలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న జింబాబ్వే ఫాస్ట్ బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీ, ఇప్పుడు IPLలో సందడి చేయనున్నాడు. కోల్కతా నైట్ రైడర్స్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ స్థానాన్ని ముజరబానీతో భర్తీ చేసింది. ఈ విషయాన్ని KKR యాజమాన్యం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. గతేడాది RCB జట్టులో ఉన్నప్పటికీ ముజరబానీకి తుది జట్టులో ఆడే అవకాశం దక్కలేదు.
VKB: వినియోగదారులకు గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఓ గ్యాస్ ఏజెన్సీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్యాస్ నిల్వలు, పంపిణీ రికార్డులను పరిశీలించి, కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమాలకు తావివ్వకుండా, సిలిండర్లను సరఫరా చేయాలని సూచించారు.
అమెరికా ఆతిథ్యమివ్వనున్న ఫిఫా వరల్డ్కప్లో పాల్గొనవద్దంటూ ఇరాన్ ఫుట్బాల్ జట్టుకు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. తమ దేశానికి వస్తే ఇరాన్ ఆటగాళ్ల భద్రతకు, ప్రాణాలకు తాము ఎటువంటి గ్యారంటీ ఇవ్వలేమని ఆయన చెప్పడం సంచలనంగా మారింది. అయితే, ఇరాన్ ఇప్పటికే ఈ టోర్నీలో పాల్గొనబోమని ప్రకటించింది. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చకు దారితీశాయి.
కడప: నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ రాకేష్ చంద్ర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. స్వచ్ఛ సర్వేక్షణంలో మంచి ర్యాంకు సాధించేందుకు నగర పరిశుభ్రత, చెత్త నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. నగరాభివృద్ధి కోసం టాక్స్ కలెక్షన్ పెంచాలని అధికారులను ఆదేశించారు. ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు మరింతగా చేపట్టాలని తెలిపారు.
శ్రీకాకుళంలో హోటల్, ఫాస్ట్ ఫుడ్ కేంద్రాల యజమానులు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. సకాలంలో సిలిండర్లు అందకపోవడంతో కట్టెల పొయ్యిలపై వంట చేస్తున్నామని వ్యాపారులు తెలిపారు. ఈ సమస్య వల్ల వ్యాపారం దెబ్బతింటోందని పేర్కొన్నారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి త్వరితగతిన సిలిండర్ల సరఫరా పునరుద్ధరించాలని కోరుతున్నారు.
VSP: మధురవాడ చంద్రంపాలెం జాతర గట్టు దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కుంకుమార్చన, పుష్పార్చన చేశారు. అనంతరం కర్పూర హారతి, నీరాజన మంత్ర పుష్పం సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
TG: రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు తమ హాల్ టికెట్లను తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలి. సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, కాలిక్యులేటర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. ప్రశ్నాపత్రం ఇవ్వగానే అన్ని ప్రశ్నలను ఒకసారి చదవండి. మీకు బాగా తెలిసిన సమాధానాలను ముందుగా రాయండి. తగినంత నిద్ర, పోషకాహారం తీసుకోండి. ALL THE BEST