• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

స్పోర్ట్స్ మీట్​లో సత్తా చాటిన కామారెడ్డి పోలీసులు

KMR: తెలంగాణ రాష్ట్ర 4వ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో కామారెడ్డి పోలీస్ క్రీడాకారులు సత్తా చాటారు. ఈ మేరకు ఉత్తమ ప్రదర్శన కనబర్చిన పోలీస్ క్రీడాకారులను ఎస్పీ రాజేష్ చంద్ర శుక్రవారం అభినందించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వేదికగా ఫిబ్రవరి 16 నుండి 21 వరకు ‘తెలంగాణ రాష్ట్ర 4వ పోలీస్ స్పోర్ట్స్ మీట్’ నిర్వహించారు.

March 13, 2026 / 07:04 PM IST

గ్యాస్ కొరత అపోహలను నమ్మవద్దు: అదనపు కలెక్టర్

NRPT: వంట గ్యాస్ కొరతపై అపోహలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అదనపు కలెక్టర్లు ఫణీందర్ రెడ్డి, శ్రీను పాల్గొన్నారు. గ్యాస్ సరఫరాపై తక్షణం సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి, ప్రజలకు నిరంతర సరఫరా అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

March 13, 2026 / 07:04 PM IST

పదవ తరగతి పరీక్షలకు 380 మంది విద్యార్థులు

ప్రకాశం: మర్రిపూడి మండలంలో ఈనెల 16వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నట్లు ఎంఈవో రంగయ్య తెలిపారు. మండలంలో మొత్తం 380 మంది పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాయినున్నట్లు తెలిపారు. జడ్పీహెచ్ పాఠశాలలో 235 మంది జూనియర్ కళాశాలలో 145 మంది విద్యార్థులు రాయనున్నట్లు చెప్పారు.

March 13, 2026 / 07:04 PM IST

మంత్రి సురేఖకు గజమాలతో ఘనస్వాగతం

NZB: జిల్లాలో శుక్రవారం పర్యటించిన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖకు నిజామాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు ఘనస్వాగతం పలికారు. మంత్రికి కాంగ్రెస్ నేతలు గజమాల వేసి స్వాగతించారు. మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, మేయర్ ఉమారాణి, పీసీసీ ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్ ఉన్నారు.

March 13, 2026 / 07:04 PM IST

‘నగదును రైతులు సద్వినియోగం చేసుకోవాలి’

ASR: అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ నగదు రైతులు సద్వినియోగం చేసుకోవాలని చింతపల్లి ఏవో మధుసూధనరావు కోరారు. శుక్రవారం వామగెడ్డ ఆర్ఎస్కేలో రైతులతో సమావేశమయ్యారు. పీఎం కిసాన్ 22వ, అన్నదాత సుఖీభవ 3వ ఇన్‌స్టాల్మెంట్ ల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రైతుల ఖాతాల్లో రూ.6వేలు జమ చేయడం జరిగిందన్నారు. మండలంలో 10,421 మంది రైతులకు రూ.6,25,26,000 నగదు జమ అయిందన్నారు.

March 13, 2026 / 07:04 PM IST

అన్నదాత సుఖీభవ నిధులు జమ

AKP: ఎలమంచిలి నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ కిసాన్ వికాస్ పథకం కింద 33,648 మంది రైతుల ఖాతాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.18.45 కోట్లు జమ చేసినట్లు ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తెలిపారు. మునగపాకలో శుక్రవారం జరిగిన అన్నదాత సుఖీభవ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు నియోజకవూర్గ టీడీపీ ఇంఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు పాల్గొన్నారు.

March 13, 2026 / 07:03 PM IST

గిరిజనుల మధ్య జనసేన ఆవిర్భావ దినోత్సవం

AP: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గిరిజనుల మధ్య రేపు పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోనున్నారు. ఈ మేరకు అల్లూరి జిల్లా నందిగరువు ప్రజలతో పవన్ మాట్లాడనున్నారు. గిరిపుత్రులతో కలిసి మధ్యాహ్న భోజనం చేయనున్నారు. అడవితల్లి బాటలో భాగంగా నిర్మించిన రోడ్లను పవన్ ప్రారంభించనున్నారు.

March 13, 2026 / 07:02 PM IST

‘వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత’

VZM: రైతుల ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. బొబ్బిలిలో శుక్రవారం నిర్వహించిన అన్నదాత సుఖీభవ మూడో విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో 2,27,700 మంది రైతు కుటుంబాలకు రూ.127.63 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నట్లు పేర్కొన్నారు.

March 13, 2026 / 07:02 PM IST

బెదిరింపులకు పాల్పడిన వ్యక్తులు అరెస్టు

ADB: ఆదిలాబాద్ పట్టణంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బెదిరింపులకు పాల్పడిన నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు టూ టౌన్ ఇన్స్పెక్టర్ కె. నాగరాజు తెలిపారు. ఆర్కే కోపరేటివ్ సొసైటీ ఛైర్మన్ కొండూరి రాకేందర్, సొసైటీ మేనేజర్‌గా రాగం రమేష్‌లను కొంతమంది వ్యక్తులు బెదిరింపులకు గురిచేస్తూ డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు.

March 13, 2026 / 07:02 PM IST

‘వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలి’

SDPT: ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా సిద్దిపేటలో సివిల్ సప్లైస్ శాఖ ఆధ్వర్యంలో వినియోగదారుల అవగాహన సదస్సు DSO తనుజ అధ్యక్షతన జరిగింది. మార్కెట్‌లో వస్తువులు కొనుగోలు చేసే ముందు తయారీ తేదీ, గడువు తేదీ పరిశీలించాలని సూచించారు. చైతన్యంతోనే మోసాలను నివారించవచ్చని తెలిపారు. ఆహార పదార్థాల్లో కల్తీ, తూకాల్లో మోసాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.

March 13, 2026 / 07:02 PM IST

ఈ మండలంలో గ్యాస్ కొరత లేదు: MRO

MDK: శివంపేట మండల వ్యాప్తంగా ఇలాంటి గ్యాస్ కొరత లేదని తహసీల్దార్ కమలాద్రి తెలిపారు. మండల కేంద్రంలోని గ్యాస్ గోదాములను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోదాంలో ఉన్న గ్యాస్ సిలిండర్ నిల్వలను పరిశీలించారు. పలు రికార్డులను తనిఖీ చేసి, గ్యాస్ సరఫరాలో వినియోగదారులకు ఇబ్బందులు కలగవద్దని సూచించారు.

March 13, 2026 / 07:01 PM IST

రేపు జిల్లాకు రానున్న సీఎం

GDWL: జిల్లాలో రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తనయుడు బండ్ల సాయి సాకేత్ రెడ్డి వివాహ వేడుకకు మధ్యాహ్నం 12 గంటలకు ఆయన హాజరవుతారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క కూడా పాల్గొనే అవకాశం ఉంది.

March 13, 2026 / 07:01 PM IST

భవన నిర్మాణాలకు శంకుస్థాపన

MDK: చేగుంట మండలం జైత్రం తండాలో నూతనంగా గ్రామపంచాయతీ భవనం, మహిళా సంఘ భవన నిర్మాణానికి శంకుస్థాపన భూమి పూజ నిర్వహించారు. ఈజీఎస్ పథకం కింద నిధులు మంజూరు కాగా గ్రామ సర్పంచ్ ధరావత్ సుభాష్ నాయక్ భవనాల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఉప సర్పంచ్ రాజేందర్, వార్డు సభ్యులు మోహన్, శోభ లౌడియా లాలీ, గణేష్, స్వప్న గ్రామ కార్యదర్శి సుధాకర్ పాల్గొన్నారు.

March 13, 2026 / 07:01 PM IST

రేపటి నుంచి ‘నో హెల్మెట్-నో ఎంట్రీ’ కార్యక్రమం ఎస్సై అభిమన్యు

NTR: వీరులపాడు మండల పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం నుంచి ‘నో హెల్మెట్-నో ఎంట్రీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్సై అభిమన్యు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనం నడిపితే రూ.1000 జరిమానా విధిస్తామని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు కుటుంబాలను అతలాకుతలం చేసే ప్రమాదం ఉన్నందున తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆయన ప్రజలకు సూచించారు.

March 13, 2026 / 07:00 PM IST

పదో తరగతి పరీక్షల ముందు సరస్వతి పూజలు

BPT: సంతమాగులూరు మండలం ఏల్చూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శుక్రవారం విద్యార్థులు సరస్వతి దేవి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈనెల 16వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానుండటంతో పరీక్షల్లో విజయవంతం కావాలని విద్యార్థులు భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు.

March 13, 2026 / 07:00 PM IST