కృష్ణా: చల్లపల్లి మండలం కొత్తమాజేరులో రైతు సేవా కేంద్రంలో మినుములు, పెసల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. మార్క్ ఫెడ్, నాఫెడ్ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్, మార్క్ ఫెడ్ డీఎం మురళీ కిషోర్ ప్రారంభించారు. ఏఎంసీ ఛైర్మన్ తోట కనకదుర్గ, వైస్ ఎంపీపీ రాంబాబు పాల్గొన్నారు.
ATP: ఎన్నికల హామీలను విస్మరించిన కూటమి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ కంపెనీలా మారిందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. అనంతపురంలో బుధవారం నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ.. అమరావతిని చంద్రబాబు తన స్వార్థం కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. సూపర్ సిక్స్ హామీల అమలును ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
KKD: వలసపాకలి గ్రామంలో ప్రధాన రహదారి దెబ్బతినడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల గుంతలు ఏర్పడి వర్షాకాలంలో నీరు నిల్వ ఉండటం వల్ల రాకపోకలు కష్టంగా మారాయి. విద్యార్థులు, రైతులు, వాహనదారులు ప్రమాద భయంతో ప్రయాణిస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారిని మరమ్మతు చేసి సురక్షితంగా మార్చాలని గ్రామస్తులు కోరుతున్నారు.
SRPT: దాడులు, దౌర్జన్యాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్పడుతున్నారని BRS పార్టీ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల వరుస దాడులను కండిస్తూ బుధవారం సూర్యాపేట పట్టణంలో విలేకరులతో మాట్లాడారు. అరాచక శక్తులను ప్రోత్సాహించడం సరికాదన్నారు. బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తామంటే సహించేది లేదన్నారు.
నెల్లూరులోని పొర్లు కట్ట సమీపంలోని టపాసుల తయారీ గోడౌన్లలో ఆర్డీవో అనూష తనిఖీలు నిర్వహించారు. టపాసుల తయారీకి అనుమతులు ఉన్నాయా లేదా అని పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా టపాసులు తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంతపేట పోలీసులు పాల్గొన్నారు. స్టాక్ పాయింట్లపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఆమె వివరించారు.
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా PGCIL/ప్రాజెక్ట్/రీజియన్లలో 188 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రికల్, సివిల్ విభాగాల్లో ITI, డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు ఉండగా.. ITI, డిప్లొమా, BE/BTech/BSc/MBA/BA ఉత్తీర్ణులైనవారు ఈనెల 11 వరకు అప్లై చేసుకోవచ్చు. సైట్: www.powergrid.in
తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘క్రేజీ కళ్యాణం’. బద్రప్ప గాజుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి హోలీ సందర్భంగా ‘బాల్ రాజ్’ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో తరుణ్ భాస్కర్ ‘సూపర్ మ్యాన్’ గెటప్లో ఎనర్జిటిక్గా కనిపిస్తున్నాడు. ఈ మూవీలో నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
AP: కూటమి ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో కీలక మార్పులు చేసింది. పాత మస్టర్ విధానానికి స్వస్తి పలికి, కొత్తగా ఫేషియల్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని అమల్లోకి తెచ్చింది. కేంద్రం ప్రవేశపెట్టిన ఈ టెక్నాలజీ వల్ల అక్రమాలకు తావుండదు. పనికి రాకుండానే జీతాలు పొందే బోగస్ కూలీల వ్యవహారానికి చెక్ పడనుంది.
KNR: శంకరపట్నం మండలం అంబాలాపూర్ గ్రామ శివారులో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న కారును వెనుక నుంచి ద్విచక్ర వాహనం బలంగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచరం అందుకున్న 108 సిబ్బంది బాధితులకు ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.
KRNL: కోసిగి మండల పరిధిలోని జంపాపురం గ్రామంలో శ్రీ సుంకలమ్మ అవ్వ దేవర ఉత్సవాలు ఇవాళ ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి అమ్మవారికి నైవేద్యం, అకుపూజ, కుంకుమార్చన, పంచామృత అభిషేకం నిర్వహించారు. సుంకులమ్మ దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. వైసీపీ జిల్లా కార్యదర్శి పీ. మురళీ మోహన్ రెడ్డి, ఎంపీపీ ఈరన్న, అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
AP: వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి పయ్యావుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చెప్పే సమాధానం వాకౌట్ చేయకుండా వైసీపీ సభ్యులు వినాలని అన్నారు. లడ్డూ అంశంపై చర్చకు వైసీపీకి 30 నిమిషాలు, టీడీపీకి 20 నిమిషాలు, మంత్రి సమాధానానికి 10 నిమిషాలు సమయం కేటాయించినట్లు ఛైర్మన్ వెల్లడించారు. అయితే, పార్టీలకు నిర్దేశిత సమయం ఉంటుందని, ప్రభుత్వ సమాధానానికి సమయం నిబంధన వర్తించదని తెలిపారు.
KMM: బోనకల్ మండలం రావినూతల–జానకిపురం మధ్య వైరా రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. చండ్రుగొండ మండలం రావికంపాడుకు చెందిన ఎన్.రమేష్ తన కుటుంబంతో కలిసి కృష్ణా జిల్లా వేములనర్వలో వెళ్తుండగా రెండు ద్విచక్ర వాహనాలు బలంగా ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో రమేష్ తలకు తీవ్ర గాయమైంది.గమనించిన స్థానికులు వెంటనే స్పందించి బోనకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
SRCL: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు బుధవారం జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 16 కేంద్రాలలో వార్షిక పరీక్షలు నిర్వహిస్తుండగా మొదటిరోజు మంది 3727 విద్యార్థులకు గాను 3653 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు అధికారులు తెలిపారు. 74 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరు అయ్యారు.
MNCL: రైతులకు ప్రభుత్వం చెల్లించాల్సిన రైతుబంధు గురించి స్పష్టత ఇవ్వాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొండగొర్ల లింగన్న కోరారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఇంతవరకు రైతుబంధు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీజన్ సగకాలం పూర్తయిన రైతుబంధు డబ్బులు రాకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని వాపోయారు. రైతులకు రైతుబంధు డబ్బులు చెల్లించాలని ఆయన కోరారు.
అన్నమయ్య: చిట్వేల్ మండలం మార్గోపల్లి పంచాయతీ గుడ్లవారిపల్లికి గ్రామానికి చెందిన పెనగలూరు లక్ష్మీదేవి గారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ. 20,524/-విలువైన చెక్కును వారి నివాసం వద్ద రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ పార్టీ ఇన్ ఛార్జ్ KUDA ఛైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారు అందజేశారు.