ATP: ఎన్నికల హామీలను విస్మరించిన కూటమి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ కంపెనీలా మారిందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. అనంతపురంలో బుధవారం నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ.. అమరావతిని చంద్రబాబు తన స్వార్థం కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. సూపర్ సిక్స్ హామీల అమలును ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.