TG: మేడిగడ్డ బ్యారేజ్లో కుంగిన పిల్లర్లను పరిశీలించామని CM రేవంత్ తెలిపారు. సాంకేతిక నిపుణులతో చర్చించామని అన్నారు. 3 నిర్మాణ సంస్థల ప్రతినిధులతో మాట్లాడామని చెప్పారు. తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత- చేవెళ్లకు YSR శ్రీకారం చుట్టారన్నారు. ఆర్థిక ప్రయోజనం లేదని KCR రీడిజైన్ చేశారని వెల్లడించారు. ప్రాజెక్టుపేరు, ఊరుమార్చి కాళేశ్వరంగా పేరుపెట్టారని వ్యాఖ్యానించారు.