KKD: వలసపాకలి గ్రామంలో ప్రధాన రహదారి దెబ్బతినడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల గుంతలు ఏర్పడి వర్షాకాలంలో నీరు నిల్వ ఉండటం వల్ల రాకపోకలు కష్టంగా మారాయి. విద్యార్థులు, రైతులు, వాహనదారులు ప్రమాద భయంతో ప్రయాణిస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారిని మరమ్మతు చేసి సురక్షితంగా మార్చాలని గ్రామస్తులు కోరుతున్నారు.