AP: వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి పయ్యావుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చెప్పే సమాధానం వాకౌట్ చేయకుండా వైసీపీ సభ్యులు వినాలని అన్నారు. లడ్డూ అంశంపై చర్చకు వైసీపీకి 30 నిమిషాలు, టీడీపీకి 20 నిమిషాలు, మంత్రి సమాధానానికి 10 నిమిషాలు సమయం కేటాయించినట్లు ఛైర్మన్ వెల్లడించారు. అయితే, పార్టీలకు నిర్దేశిత సమయం ఉంటుందని, ప్రభుత్వ సమాధానానికి సమయం నిబంధన వర్తించదని తెలిపారు.