MDK: మెదక్లోని రాందాస్ చౌరస్తాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు అవమానించడం కలకలం రేపింది. విగ్రహం ముఖంపై పేడ కొట్టి, తలపై చెప్పు ఉంచి అపచారం చేశారు. ఈ ఘటనను నిరసిస్తూ మున్సిపల్ మాజీ ఛైర్మన్ చంద్రపాల్, కౌన్సిలర్ శివరామకృష్ణ, ఆర్యవైశ్య సంఘ సభ్యులు విగ్రహం వద్ద నిరసన చేపట్టారు.