SKLM: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈనెల 6న మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్టు మెడికవర్ సెంటర్ హెడ్ డాక్టర్ పి.సాగరిక తెలిపారు. నగరంలోని మెడికవర్ ఆస్పత్రిలో బుధవారం గైనకాలజిస్ట్ డాక్టర్ బలగ రజిని విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇటీవల కాలంలో మహిళలకు ఆరోగ్య సంబంధిత వ్యాధులు ఎక్కువగా ప్రబలుతున్నాయన్నారు.