VSP: విశాఖ మురళీనగర్ సెక్టార్-11లో ట్రెక్కింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. దివంగత కె. త్రిపురసుందరరావు జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న ఈ సేవా కార్యక్రమంలో పాదచారులు, కార్మికులకు ప్రతిరోజూ మంచినీరు, మజ్జిగ అందజేస్తున్నారు. ఈ చలివేంద్రం 50 రోజుల పాటు కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో పలు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.