KMM: బోనకల్ మండలం రావినూతల–జానకిపురం మధ్య వైరా రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. చండ్రుగొండ మండలం రావికంపాడుకు చెందిన ఎన్.రమేష్ తన కుటుంబంతో కలిసి కృష్ణా జిల్లా వేములనర్వలో వెళ్తుండగా రెండు ద్విచక్ర వాహనాలు బలంగా ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో రమేష్ తలకు తీవ్ర గాయమైంది.గమనించిన స్థానికులు వెంటనే స్పందించి బోనకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.