JN: పాలకుర్తి మండలం గుడికుంట తండా గ్రామంలో దుర్గమ్మ పండగ వేడుక మంగళవారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు. దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.