BDK: మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలు సమస్యల పరిష్కారం కోసం ఆశా వర్కర్లు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును శుక్రవారం కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు తమకు ఎదురవుతున్న వివిధ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
AP: అధికారులపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఫొటో చాలా చిన్నగా ఉందంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు ఈ రకంగా వ్యవహరించడం చాలా బాధాకరమని అన్నారు. ఇకపై ఇలా జరగకుండా చూడాలని సూచించారు. అనంతరం కార్యక్రమంలో మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు.
BDK: రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ పసుపులేటి వీరబాబు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరితో కలిసి తెలంగాణ సమస్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం రాజ్యసభలో పోరాడాలని వీరబాబు కోరారు.
CTR: నగరి మున్సిపాలిటీ పాండురాజు పురం నందు శ్రీ విజయగణపతి ఆలయ కుంభాభిషేకం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ సభ్యులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఎమ్మెల్యేకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ELR: ముసునూరు మండలం చెక్కపల్లి గ్రామంలో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని శుక్రవారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి కొలుసు పార్థసారథి, కలెక్టర్ వెట్రిసెల్వి పాల్గొన్నారు. అనంతరం సీఎం చంద్రబాబు ప్రసంగాన్ని వీక్షించారు. అలాగే రైతుల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పేర్కొన్నారు.
NLR: నగరపాలక సంస్థ పరిధిలోని పట్టణ ప్రణాళిక పెండింగ్ ఫైళ్లను తక్షణమే క్లియర్ చేయాలని కమిషనర్ వై.ఓ నందన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. నక్ష సర్వేకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, సర్వేలో 30% కన్నా తక్కువ పురోగతి ఉన్న సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేశారు.
WNP: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను వెల్ఫేర్ బోర్డు ద్వారానే అందించాలని శుక్రవారం జిల్లా ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నిక్సన్ డిమాండ్ చేశారు. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు బాధ్యతలు అప్పగించే జీవో 12ను సవరించాలని కోరుతూ ఏఎల్సీ రవికి వినతిపత్రం ఇచ్చారు. మరణించిన కార్మికులకు చెల్లించాల్సిన పరిహారం బోర్డు నుంచే నేరుగా అందించాలన్నారు.
HNK: దేశంలో పెరిగిన గ్యాస్, నిత్యావసరాల ధరలను అదుపు చేయటంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట బిక్షపతి అన్నారు. గుండ్ల సింగారంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి ఆచరణలో అరకొర అమలు చేసి గొప్పలు చెప్పుకుంటున్నాయన్నారు.
VZM: గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో విజయనగరంలో శుక్రవారం వినూత్న నిరసన చేపట్టారు. కన్యాకాపరమేశ్వరి ఆలయం జంక్షన్ వద్ద గ్యాస్ బండను తలపై పెట్టుకుని ఆందోళన నిర్వహించారు. జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ మాట్లాడుతూ.. గ్యాస్ ధరలు పెంచి సామాన్య ప్రజలపై భారం మోపారని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.
విమాన ప్రయాణికులకు ఇండిగో విమానయాన సంస్థ షాక్ ఇచ్చింది. పెరిగిన జెట్ ఇంధన ధరల ప్రభావంతో ఫ్యూయల్ సర్ఛార్జీని పెంచుతున్నట్లు ప్రకటించింది. రేపటి నుంచి అన్ని దేశీయ, అంతర్జాతీయ సర్వీసులపై ఈ అదనపు భారం పడనుంది. ఇప్పటికే ఎయిరిండియా సర్ఛార్జీ విధించగా, తాజాగా ఇండిగో కూడా అదే బాటలో పయనిస్తోంది. దీంతో విమాన ప్రయాణం మరింత భారం కానుంది.
NZB: ఎవరైనా కృత్రిమ కొరతను సృష్టించి బ్లాక్ మార్కెట్లో గ్యాస్ సిలిండర్లను విక్రయిస్తే నిత్యావసర సరకుల చట్టం-1955 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని NZB కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం హెచ్చరించారు. జిల్లాలో 5,81,769 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని, 33 గ్యాస్ ఏజెన్సీల ద్వారా సరఫరా జరుగుతోందని, 10,850 సిలిండర్లు జిల్లాలో గృహావసరాల కోసం అందుబాటులో ఉన్నాయన్నారు.
KNR: విద్యార్థులు ఒత్తిడికి లోనవకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని, 10వ తరగతి విద్యార్థులకు చొప్పదండి మండల విద్యాధికారి పి. మోహన్ సూచించారు. ఈనెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగబోయే పదవ తరగతి వార్షిక పరీక్షలకు మండలంలో 3 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు, 237 మంది బాలురు, 296 మంది బాలికలు మొత్తం, 533 రాస్తున్నారని తెలిపారు.
ASR: ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అరకులోయ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ చలపతిరావు తెలిపారు. శుక్రవారం కళాశాలలో నిర్వహించిన “30 రోజుల ఇంగ్లీష్ కమ్యునికేషన్ స్కిల్స్” శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ శిక్షణలో తెలిపిన చిట్కాలను ప్రతిరోజు పాటిస్తే ఇంగ్లీష్ కమ్యునికేషన్ మెరుగుపడుతుందని అన్నారు.
WNP: పోలీసు సిబ్బంది సంక్షేమం, ఆరోగ్యం, పిల్లల విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపడం ద్వారా మాత్రమే పోలీస్ శాఖ మరింత బలపడుతుందని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు. శుక్రవారం వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో సాయిధ దళ పోలీసు సిబ్బందితో సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో, ఎన్నికల సమయంలో సాయిధ దళ పోలీసు సేవలు అత్యంత కీలకమని తెలిపారు.
NZB: అవకాశం దొరికితే మళ్లీ మళ్లీ ఇందూరు తిరుమలకు వస్తానని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం ఆమె మోపాల్ మండలం నర్సింగ్ పల్లిలోని ఇందూరు తిరుమల క్షేత్రంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. ఆలయం నేపథ్యం తెలుసుకొని తాను సంభ్రమాశ్చర్యాలకు గురి అయ్యానన్నారు. స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు.