NRML: సారంగాపూర్ మండలంలోని జామ్ గ్రామంలో గల జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు వారే స్వయంగా రకరకాల ఆహార పదార్థాలను తయారు చేసి స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ ఫుడ్ స్టాల్ను సర్పంచ్ కలిపే రవళి విలాస్, ఉప సర్పంచ్ గంగాధర్, ఉపాధ్యాయులు పలువురు సందర్శకులు సందర్శించారు. ఆహార పదార్థాలు రుచి చూశారు.
TPT: నాయుడుపేటలో టిడ్కో ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సీఎం చంద్రబాబు ఇవాళ ఇక్కడికి రావాల్సి ఉంది. అనివార్య కారణాలతో ఆయన పర్యటనను ఈనెల 24వ తేదీకి వాయిదా వేశారని సూళ్లూరుపేట MLA నెలవల విజయశ్రీ చెప్పారు. ఆ రోజున సీఎం చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇళ్లను అందజేయనున్నారు.
TG: HYDలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళిక రూపొందిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్న 1.26 లక్షల ఆటోలను దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడంపై దృష్టి సారించింది. ఈ మేరకు ఆటో యజమానులకు రెట్రోఫిట్మెంట్ ఎలక్ట్రిక్ కిట్లు100 శాతం సబ్సిడీతో అందించనుంది. కాగా, ఒక్కో ఆటోకు సుమారు రూ.1.20 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చు అవుతుంది.
అన్నమయ్య: గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణలో భాగంగా, శుక్రవారం పుల్లంపేట మండలంలోని పలు గ్రామాల్లో బాలికలకు వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. పుల్లంపేట, కొత్తపేట, అనంతంపల్లి హెల్త్ సెంటర్లలో అర్హులైన బాలికలకు టీకాలు వేశారు. ఈ టీకా ద్వారా భవిష్యత్తులో క్యాన్సర్ బారి నుంచి రక్షణ పొందవచ్చని అన్నారు. మండలాన్ని క్యాన్సర్ రహితంగా తీర్చిదిద్దుతామని అధికారులు తెలిపారు.
CTR: పూతలపట్టు మండలంలో ఇవాళ ఉదయాన్నే ప్రమాదం జరిగింది. తిరుమల శ్రీవారి దర్శనార్థం బెంగళూరు నుంచి నలుగురు కారులో బయలుదేరారు. పీజీ మిట్టూరు సమీపంలోని బాట గంగమ్మ దేవస్థానం వద్దకు రాగానే కారు అదుపుతప్పింది. డివైడర్ పక్కన కాలువలో బోల్తా కొట్టింది. అదృష్టవశాత్తు ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
KMR: మద్నూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఈ నెల 16న ఉపాధి హామీ పథకం సామాజిక ప్రజావేదిక నిర్వహించనున్నట్లు ఎంపీడీవో రాణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 15 వరకు మండలంలోని గ్రామాల్లో జరిగిన సామాజిక తనిఖీ వివరాలపై ఈ వేదికలో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకావాలని ఆమె కోరారు.
JN: జిల్లాలో వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులకు సూచించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని బోర్లు, పైప్లాన్లు, చేతిపంపులను వెంటనే మరమ్మతు చేసి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. ప్రజలకు తాగునీటి సమస్యలు ఉంటే వెంటనే స్పందించాలని అధికారులకు తెలిపారు.
KNR: చిగురుమామిడి మండలం నవాబుపేట ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం పోచమ్మ బోనాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, గ్రామ వీధుల్లో బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా బయలుదేరి, డబ్బు చప్పుళ్లతో నృత్యాలు చేస్తూ ఆలయానికి చేరుకొని నైవేద్యాలు సమర్పించారు.
ASR: కొయ్యూరు కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకుగాను విద్యార్థులు ధరఖాస్తు చేసుకోవాలని ASO సత్యవతి తెలిపారు. 6వ తరగతిలో 40 సీట్లు, 10వ తరగతిలో 1, ఇంటర్ మొదటి సంవత్సరంలో 40 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హులైన విద్యార్థులు ఏప్రిల్ 1వ తేదీలోగా https://apkgbv.apcfss ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
VZM: ద్విచక్ర వాహనం ఢీకొని మహిళా మృతి చెందిన ఘటన కొత్తవలస పోలీసు స్టేషన్ పరిధి చింతలపాలెం వద్ద శుక్రవారం రాత్రి జరిగింది. వివరాల ప్రకారం.. శిరిడీ రమణమ్మ కిరాణా దుకాణానికి వస్తుండంగా రోడ్డు దాటే క్రమంలో పెందుర్తి నుంచి కొత్తవలస వస్తున్న ద్విచక్ర వాహన దారుడు బలంగా డీ కొట్టాడు. ఆమె స్టాపర్పై పడడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేశారు.
VKB: జిల్లాలో నీటి ఎద్దడి నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. వికారాబాద్ కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో వేసవిలో నీటి ఎద్దడి నివారించేలా చర్యలు తీసుకోవడంపై అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. నీటి ఎద్దడిని గుర్తించి ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తూ నీటిఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
NZB: ఇందల్వాయిమండల డోన్కల్కు చెందిన భార్గవి అనే మహిళ శనివారం అంబులెన్స్లో ప్రసవించింది. పురిటి నొప్పులతో 108లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో ఈఎంటీ అంబాదాస్, పైలెట్ అబ్దుల్ చాకచక్యంగా ప్రసవం చేయగా.. ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వారు తెలిపారు.
W.G: పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ నియోజకవర్గ పరిశీలకులను శుక్రవారం రాత్రి పార్టీ అధిష్టానం నియమించింది. ఆచంట ఎడ్ల తాతాజీ, పాలకొల్లు పేరిచర్ల విజయ నరసింహారాజు, నరసాపురం ముప్పిడి సంపత్ కుమార్, తణుకు కొట్టు నాగేంద్ర, తాడేపల్లిగూడెం వెండ్ర వెంకటస్వామి నియమితులయ్యారు. వీరందరూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
PPM: జిల్లాలో రీ-సర్వే ప్రక్రియను ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా పూర్తి చేయాలని, ఎటువంటి జాప్యం జరగకూడదని జాయింట్ కలెక్టర్ సీ. యశ్వంత్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రీ-సర్వే పనుల పురోగతిపై జేసీ శుక్రవారం బలిజిపేట తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. విలేజ్ సర్వేయర్లు, వీఆర్వోలు సమన్వయంతో పనిచేయాలన్నారు.