JN: జిల్లాలో వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులకు సూచించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని బోర్లు, పైప్లాన్లు, చేతిపంపులను వెంటనే మరమ్మతు చేసి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. ప్రజలకు తాగునీటి సమస్యలు ఉంటే వెంటనే స్పందించాలని అధికారులకు తెలిపారు.