KNR: గంగాధర మండలంలోని లింగంపల్లిలో ఏర్పాటు చేసిన వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాన్ని సోమవారం తహశీల్దార్ అంబటి రజిత, ఎంపీడీవో దమ్మని రాము ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా, ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు.