KDP: పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలి విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు’ అని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ హెచ్చరించారు. సుండుపల్లిలో ఇటీవల ప్రారంభించిన పోలీసు సర్కిల్ కార్యాలయాన్ని ఆయన మంగళవారం తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి సిబ్బంది పనితీరు, హాజరుపై ఆరా తీశారు. కేసుల దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.