NDL: జిల్లాలో రసాయన విపత్తుల సమయంలో అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ నెల 30న ‘ఆఫ్-సైట్’ మాక్ డ్రిల్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అమరావతి నుంచి నిర్వహించిన VCలో డీఆర్వో రాము నాయక్ సహా సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.