ELR: నరసాపురం మండలం శ్రీరామవరంలో 20 కుటుంబాలు టీడీపీ పార్టీలోకి చేరేందుకు సిద్ధమయ్యారు. ఆ కుటుంబాలతో మల్లుకుంట సొసైటీ ఛైర్మన్ శీలం సాయి వినయ్ మంగళవారం రాత్రి పరిచయ కార్యక్రమం నిర్వహించారు. అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం, అభివృద్ధి చూసి పార్టీలో చేరుతున్న వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.