NDL: కర్నూలు రేంజ్ డీఐజీ డా.కోయ ప్రవీణ్ విదేశీ పర్యటన ఖరారైంది. మే 14 నుంచి జూన్ 7వ తేదీ వరకు ఆయన అమెరికాలో పర్యటించనున్నారు. విదేశీ యాత్రకు అనుమతి ఇవ్వాలని పెట్టుకున్న ఆయన వినతికి సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ మేరకు అనుమతి, సెలవు మంజూరు చేసింది. అనంతరం అధికారిక ఉత్తర్వులు ప్రభుత్వం ఇవాళ జారీ చేసింది.