కామారెడ్డి జిల్లా పీఎంపీ, ఆర్ఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా మహిళా విభాగం కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ మేరకు ఆర్ఎంఈ, పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నిజ్జన విఠల్ వివరాలు వెల్లడించారు. మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలిగా సూర సునీత, ప్రధాన కార్యదర్శిగా రాథోడ్ రుక్మిణి, గౌరవాధ్యక్షురాలిగా చామరం విమల, ఉపాధ్యక్షురాలిగా వడ్ల సుజాత ఉన్నారు.