చిత్తూరు నగరంలోని సాంబయ్య కండ్రిగ ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పర్యవేక్షణలో ఎమ్మెల్యే, నగర పాలక కమిషనర్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ సిటీ ప్లానర్ నాగేంద్ర సిబ్బందితో కలిసి భవన యజమానుల సహకారంతో పనులు చేపట్టారు. నగర అభివృద్ధికి ప్రజల సహకారం కీలకమని అధికారులు తెలిపారు.