KMR: బిక్కనూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం కంటి పరీక్షలు నిర్వహించారు. మండల కంటి వైద్యాధికారి రవీందర్ పటేల్ ఆధ్వర్యంలో ఈ పరీక్షలు చేపట్టారు. అవసరమైన వారికి కంటి అద్దాలు వాడుకోవాలని సూచించారు. కంటి వ్యాధుల పట్ల ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దని ఆయన తెలిపారు. అవసరమైతే ఆపరేషన్ చేయించుకోవాలని సూచించారు.