మునగ ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ మునగ కొందరు తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. గర్భధారణ సమయంలో అసౌకర్యం, సమస్యలకు దారితీస్తుంది. అలాగే పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావంతో ఇబ్బంది పడే స్త్రీలు కూడా మునగ తినకుండా ఉండాలి. దీనిలోని వేడి లక్షణాలు రక్తస్రావాన్ని మరింత పెంచుతాయి.
TG: మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టు లోపాలపై ఎలా ముందుకెళ్లాలో స్పష్టత వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. NDSA ఆదేశాల ప్రకారం ముందుకెళ్తామన్నారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని అన్నారు. చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టారని గుర్తు చేశారు.
BHNG: విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో దేశంలో పెరుగుతున్న లవ్ జిహాద్, అక్రమ మత మార్పిడులకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వీహెచ్పీ జిల్లా ప్రచార ప్రముఖ్ పవన్ కుమార్ మాట్లాడుతూ.. ప్రణాళికాబద్ధంగా జరుగుతున్న ఈ కుట్రలను ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. యువతుల జీవితాలతో ఆడుకుంటున్న వికృత మనస్తత్వాలపై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.
అహ్మదాబాద్లో ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉన్న ముంబై, ఈ మ్యాచ్తోనైనా విజయాల బాట పట్టాలని భావిస్తోంది. వరుసగా మూడు విజయాలతో జోష్లో ఉన్న గుజరాత్, తమ సొంత మైదానంలో మరో విజయంపై కన్నేసింది. దీంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగనుంది.
KRNL: ఏపీ ప్రభుత్వం నిర్వహించిన పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ సర్వేలో కౌతాళం (మం) ఉరుకుందలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానం రాష్ట్రంలో మొదటి స్థానం సాధించింది. దర్శనం, ప్రసాదం, మౌలిక వసతులు, పారిశుద్ధ్యం అంశాల్లో మెరుగైన సేవలతో వరుసగా మూడోసారి టాప్లో నిలిచింది. భక్తులకు ఇంకా మెరుగైన సేవలు అందిస్తామని డిప్యూటీ కమిషనర్ కే.వాణి తెలిపారు.
NRPT: మరికల్ మండలంలోని ఇబ్రహీంపట్నం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ. ఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠాపనకు సర్పంచ్ కోయిలకొండ నాగమణిరఘు సోమవారం భూమిపూజ చేశారు. దాతల సహకారంతో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠాపనకు భూమి పూజ చేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మునిస్వామి, రవిచంద్ర కుమార్ అంజి, శ్రీను, గ్రామస్థులు పాల్గొన్నారు.
GDWL: జిల్లాలో సంక్షేమ వారోత్సవాల సందర్భంగా సోమవారం అదనపు కలెక్టర్ నర్సింగ్ రావు గద్వాలలో బీసీ బాలికల వసతిగృహాన్ని సందర్శించారు. వంటశాల, స్నానాల గదులు, మరుగుదొడ్లను పరిశీలించి పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని సూచించారు. విద్యార్థులకు రుచికరమైన ఆహారం అందించాలని తెలిపారు. వసతులు సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొంటూ, సమస్యలు లేకుండా నిర్వహించాలన్నారు.
ATP: గ్రామాల్లో నిర్వీర్యమైన చెత్త నిర్వహణ యూనిట్లు, కంపోస్ట్ షెడ్లను పునరుద్ధరించాలని కోరుతూ జిల్లా BJPఅధ్యక్షుడు రాజేష్ కలెక్టర్ ఆనంద్ కు వినతిపత్రం అందజేశారు. క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు పారిశుద్ధ్య సమస్యలు తన దృష్టికి వచ్చాయని పేర్కొన్నారు. నిర్వహణ లోపం వల్ల షెడ్లు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
NGKL: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ ప్రజావాణి కి 14 దరఖాస్తులు వచ్చినట్లు ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ తెలిపారు. బాధితుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలు నిర్భయంగా పోలీసులను సంప్రదించి చట్టపరమైన సాయం పొందాలని ఆయన సూచించారు.
SDPT: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బెజ్జంకి మండలంలోని బీసీ హాస్టల్ను ఎంపీడీవో కడవెర్గు ప్రవీణ్ పరిశీలించారు. హాస్టల్లో ఆహార నాణ్యత, సౌకర్యాలు, పరిశుభ్రత, భద్రతపై సమీక్షించారు. బాత్రూంలలో తగిన నీటి వసతి కల్పించాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు.
NLR: బుచ్చిరెడ్డిపాలెం నగర కమిషనర్ బాలకృష్ణ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో బుచ్చి నూతన కమిషనర్గా ఇనమల చినబాబును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన సోమవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కార్యాలయ సిబ్బందిని పరిచయం చేసుకున్నారు.
ADB: గాదిగూడ మండలంలోని మేడిగూడ గ్రామంలో సోమవారం బాల్యవివాహం కోసం సన్నాహాలు జరుగుతున్నాయని పోలీసులు సమాచారాన్ని అందుకున్నారు. దీంతో ఎస్సై రమ్య సిబ్బందితో కలిసి వివాహం నిర్వహిస్తున్న కుటుంబానికి బాల్యవివాహం వల్ల వచ్చే పరిణామాలను వివరించి వారిని అడ్డుకున్నారు. ఎవరైనా బాల్యవివాహం నిర్వహిస్తే చట్టరీత్య చర్యలు తప్పవని హెచ్చరించారు.
KKD: తుని మండలం ఎర్రకోనేరు గ్రామంలో సోమవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగి ఇసరపు రాజు, సత్యవతి దంపతుల తాటాకిల్లు, ఆ పక్కనే ఉన్న గడ్డివాము దగ్ధమైంది. కొత్త ఇంటి నిర్మాణం కోసం దాచుకున్న డబ్బుతో పాటు ఇంటిలోని ప్రతి వస్తువు కాలి బూడిదైంది. కట్టుబట్టలతో మిగిలిపోయారు. సుమారు రూ.8 లక్షలు నష్టపోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
MBNR: మిడ్జిల్ మండలం దోనూర్ గ్రామంలో నిర్వహించిన ‘బడిబాట’లో హెచ్ఎం తారా సింగ్ పాల్గొన్నారు. నర్సరీ నుంచి 5 వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన విద్యనందిస్తున్నామని తెలిపారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో పిల్లల భవిష్యత్తు మారుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు.
TPT: తిరుపతి నగరపాలక సంస్థలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు మొత్తం 27 వినతులు అందాయని అదనపు కమిషనర్ శారదా దేవి తెలిపారు. కార్యాలయానికి నేరుగా 23 మంది, ఫోన్ ద్వారా 4 మంది తమ సమస్యలు తెలియజేశారు. వాకర్స్ వే ఆక్రమణలు, కాలువ నిర్మాణం, త్రాగునీటి సమస్యలు, చెత్త నిర్వహణ వంటి అంశాలపై వినతులు రావడంతో సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.