TPT: వడమాలపేట మండలంలో 20 కేజీల గంజాయి పట్టుకొని, నలుగురిని అరెస్టు చేసినట్లు పుత్తూరు DSP రవికుమార్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఫ్లయింగ్ స్క్వాడ్, ఇతర సిబ్బంది వడమాలపేట మండలంలోని టీటీడీ స్థలాల సమీపంలో ఒక మోటార్ సైకిల్, స్కూటీని తనిఖీ చేయగా వారి వద్ద 20 కేజీల గంజాయి పట్టుబడినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలించినట్లు తెలియజేశారు.
MHBD: నర్సింహులపేట మండలంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మంగళవారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్బంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆమె ఆకస్మికంగా తనిఖీచేసారు. పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న సదుపాయాల గురించి ఆరా తీశారు. అలాగే పలువురు విద్యార్థుల ప్రతిభను కలెక్టర్ పరీక్షించారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందించేలా ప్రతి ఒక్కరు కృషిచేయాలన్నారు.
E.G: నన్నయ యూనివర్సిటీ డీన్ అకడమిక్ అఫైర్స్ ఆధ్వర్యంలో మంగళవారం డిగ్రీ బోర్డు ఆఫ్ స్టడీస్(BOS) సమావేశం నిర్వహించారు. VC ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ హాజరై BOS చైర్మన్లు, సభ్యులకు దిశానిర్దేశం చేశారు. యూనివర్సిటీలో విద్యా ప్రమాణాలు పెంచుతూ అన్ని డిగ్రీ కోర్సుల్లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP) 2020, రాష్ట్ర ఉన్నత విద్యామండలి మార్గదర్శకాలను పక్కాగా అమలు చేయాలన్నారు.
నల్లగొండలోని తులసీనగర్ దేవాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న శేఖర్ ఈవోగా పదోన్నతి పొందాడు. హైదరాబాద్లో మంగళవారం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్ చేతుల మీదుగా ఆయన పదోన్నతి ఉత్తర్వులు అందుకున్నాడు. ఆ శాఖ ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ భాస్కర్ తోపాటు పలువురు అభినందించారు.
SRPT: ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ సరఫరాను తనిఖీ చేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్కు గురై సైదులు అనే యువ రైతు మృతి చెందాడు. మంగళవారం చివ్యెంల మండలం వట్టిఖమ్మం పహాడ్ గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ పనుల కోసం పొలానికి వెళ్లిన సైదులు, కరెంట్ సరఫరాను సరిచేసే క్రమంలో ప్రాణాలు వదలడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
HYD: మహిళా సాధికారతలో భాగంగా ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండ్లో రూ.20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ భవనానికి మంత్రి సీతక్క, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ భూమిపూజ చేశారు. నగరంలో మంజూరైన 4 హాస్టళ్లలో భాగంగా దీనిని నిర్మిస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థినులు, ఉద్యోగినులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు.
SRD: నారాయణఖేడ్ మండలంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం షెడ్యూల్ వారీగా కొనసాగుతోంది. ఈ క్రమంలో మంగళవారం గ్రామపంచాయతీలో రోడ్లు శుభ్రత, మురికి కాలువల్లో పూడిక, చెత్తాచెదారం తొలగింపు పనులు ముమ్మరంగా కొనసాగాయి. మండలంలోని లింగాపూర్ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి నాగలక్ష్మి పనులను పర్యవేక్షించారు. గ్రామ స్వచ్ఛత కోసం ప్రజలు సహకరించాలని కోరారు.
CTR: కుప్పం మండలం కృష్ణదాసన పల్లెకు చెందిన షణ్ముగం భార్య సునీత(40) బైక్ నుంచి జారిపడి మృతి చెందింది. సోమవారం భార్యాభర్తలు తమిళనాడు రాష్ట్రం వేపనపల్లికి వెళుతుండగా గుడిపల్లి మండలం శ్రీనివాసపురం సమీపంలో స్పీడ్ బ్రేకర్ వద్ద ప్రమాదవశాత్తు సునీత బైక్ నుంచి జారీ కింద పడింది. ఆమె తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ మృతిచెందారు.
PLD: చిలకలూరిపేట మున్సిపాలిటీకి స్పెషల్ ఆఫీసర్గా జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సింహను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 18 నుంచి ప్రస్తుత పాలకవర్గం బాధ్యతలు నుంచి తప్పుకోనుంది. పురపాలక సంఘం పాలనలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి వరకు ఈమె బాధ్యతలు చేపట్టనున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని KGBV, మూకమామిడి ఏకలవ్య పాఠశాలలను జిల్లా కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న బోధన, భోజన నాణ్యత, వసతులను పరిశీలించారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. లక్ష్య సాధన కోసం కష్టపడి చదివి రాబోయే పరీక్షల్లో విజయం సాధించాలని ప్రోత్సహించారు.
BHPL: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ (ఏటీసీ) ద్వారా యువతకు ఉత్తమ శిక్షణ, మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని MLA గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. ఇవాళ కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ITC కేంద్రాన్ని సందర్శించారు. 2D, 3D మిషన్, అడ్వాన్స్డ్ సీఎన్సీ మిషన్, రోబోటిక్ వెల్డింగ్ మిషన్, ఎలక్ట్రిక్ వాహనాన్ని ప్రారంభించారు.
HYD: సికింద్రాబాద్ కేంద్రంగా సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సరోగసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తన దర్యాప్తును ముమ్మరం చేసింది. నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్ఎ) కింద డాక్టర్ నమ్రత కుటుంబానికి చెందిన రూ.29.76 కోట్ల విలువైన స్థిరాస్తులను ఈడీ జప్తు చేసింది. బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ.50 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.
KKD: కమలాపురం మండలం కోగటం గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 422 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలిస్తున్నట్లు సిఐ మోహన్, ఎస్సై విద్యాసాగర్ మీడియా సమావేశంలో తెలిపారు. గ్రామంలో అక్రమ మద్యం విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టామని పోలీసులు తెలిపారు.
KNR: కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలనూ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. సచివాలయంలో శ్రీధర్ బాబు అధ్యక్షతన గోదావరి పుష్కరాలు-2027 క్యాబినేట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు ఆది పుష్కరాలు, 2028 జూలై 13 నుంచి 24 వరకు అంత్య పుష్కరాలను నిర్వహిస్తామన్నారు.
WNP: ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈనెల 12న నిర్వహించబోయే గ్రామ సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్ల శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ తెలిపారు. మంగళవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశా నిర్దేశం చేశారు.